BigTV English

Chandrababu Naidu : కాంచీపురంలో టీడీపీ చీఫ్.. 3000 ఏళ్ల నాటి ఆలయంలో చంద్రబాబు పూజలు..

Chandrababu Naidu : కాంచీపురంలో టీడీపీ చీఫ్..  3000 ఏళ్ల నాటి ఆలయంలో చంద్రబాబు పూజలు..
Chandrababu Naidu latest news

Chandrababu Naidu latest news(AP news today telugu):

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీపెరంబుదూర్ ఆదికేశవ పెరుమాళ్ ఆలయన్ని దర్శించుకున్నారు. తమిళనాడు.. కాంచీపురం జిల్లాలోని శ్రీ పెరంబుదూర్‌లో 3000 సంవత్సరాల నాటి ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ప్రసిద్ధి గాంచింది.


చంద్రబాబు నాయుడు బుధవారం కుటుంబ సమేతంగా స్వామి దర్శనం కోసం ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళారు. ఈ సందర్భంగా కాంచీపురం జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడును హిందూ ధార్మిక శాఖ వారు సన్మానించారు. శాలువా కప్పి.. పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఏనుగు నుంచి చంద్రబాబుకు ఆశీస్సులు అందించారు.

స్వామి వారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి.. ఆలయ రికార్డు పుస్తకంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు చంద్రబాబు నాయుడుకు రామానుజుల ఫొటోను సావనీర్‌గా బహూకరించారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టమన్నారు చంద్రబాబు. తెలుగువారి కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని.. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు.


Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×