BigTV English

Chandrababu Naidu : కాంచీపురంలో టీడీపీ చీఫ్.. 3000 ఏళ్ల నాటి ఆలయంలో చంద్రబాబు పూజలు..

Chandrababu Naidu : కాంచీపురంలో టీడీపీ చీఫ్..  3000 ఏళ్ల నాటి ఆలయంలో చంద్రబాబు పూజలు..
Chandrababu Naidu latest news

Chandrababu Naidu latest news(AP news today telugu):

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీపెరంబుదూర్ ఆదికేశవ పెరుమాళ్ ఆలయన్ని దర్శించుకున్నారు. తమిళనాడు.. కాంచీపురం జిల్లాలోని శ్రీ పెరంబుదూర్‌లో 3000 సంవత్సరాల నాటి ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ప్రసిద్ధి గాంచింది.


చంద్రబాబు నాయుడు బుధవారం కుటుంబ సమేతంగా స్వామి దర్శనం కోసం ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళారు. ఈ సందర్భంగా కాంచీపురం జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడును హిందూ ధార్మిక శాఖ వారు సన్మానించారు. శాలువా కప్పి.. పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఏనుగు నుంచి చంద్రబాబుకు ఆశీస్సులు అందించారు.

స్వామి వారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి.. ఆలయ రికార్డు పుస్తకంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు చంద్రబాబు నాయుడుకు రామానుజుల ఫొటోను సావనీర్‌గా బహూకరించారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టమన్నారు చంద్రబాబు. తెలుగువారి కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని.. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు.


Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×