E-Paper
Advertisement

CM Chandrababu: టీచర్‌‌గా సీఎం చంద్రబాబు.. స్టూడెంట్‌‌గా మంత్రి లోకేష్, పీటీఎం ముచ్చట్లు

CM Chandrababu: టీచర్‌‌గా సీఎం చంద్రబాబు.. స్టూడెంట్‌‌గా మంత్రి లోకేష్, పీటీఎం ముచ్చట్లు
Advertisement

CM Chandrababu: క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సీఎం చంద్రబాబు కాసేపు ఉపాధ్యాయుడిగా మారిపోయారు. స్కూల్‌లోని విద్యార్థులకు పాఠాలు చెప్పారు.  ఆ తరగతిలో మంత్రి నారా లోకేశ్‌ విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు. అరుదైన సన్నివేశం ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రాంతం వేదికైంది.

రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు-ఉపాధ్యాయులతో మెగా సమావేశాన్ని శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, దాతలు, పూర్వ విద్యార్థులు అందరినీ ఒక చోటకు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని కొత్తచెరువు జడ్పీ పాఠశాల వేదికైంది.

Advertisement

ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు ముఖ్యమంత్రి. భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారని విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి సమాధానాలు తెలుసుకున్న సీఎం, తరగతి గదులను పరిశీలించారు. గదులను చూసిన సీఎం చంద్రబాబు కాసేపు ఉపాధ్యాయుడిగా మారిపోయారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. వనరులు అనే సబ్జెక్టుపై చిన్న క్లాస్‌ తీసుకున్నారు.

ఆ క్లాస్‌లో మంత్రి లోకేశ్‌ విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు. చివరకు విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు పరిశీలించిన సీఎం చంద్రబాబు, వారికి వచ్చిన మార్కులపై ఆరా తీశారు. మీటింగుకు వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాల ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఫొటోలు దిగారు.

Advertisement

ALSO READ: కార్యకర్తల మధ్య ఉక్కిరిబిక్కిరైన రోజా

విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ బాగా పని చేస్తున్నారని, పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చారని అన్నారు.  అంతకుముందు మెగాపేరెంట్-టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫోటో ఫ్రేమ్‌లో ఫోటోలు దిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. ఆ తర్వాత సీఎంకు గౌరవ వందనం సమర్పించారు ఎన్సీసీ కేడెట్‌లు.

విద్యార్ధులు రూపొందించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను తిలకించారు. జెడ్పీ పాఠశాల పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం, అధికారులకు పలు సూచనలు చేశారు.

 

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×