E-Paper
Advertisement

Chandrababu With Pawan: రాజ్యసభ సీటు.. నోటిఫికేషన్ వచ్చేసింది, ఏం చేద్దాం

Chandrababu With Pawan: రాజ్యసభ సీటు.. నోటిఫికేషన్ వచ్చేసింది, ఏం చేద్దాం

Chandrababu With Pawan: ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటుకు నోటిఫికేషన్ ఇచ్చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 2028 జూన్ వరకు ఆయన పదవీకాలం ఉండగానే,  కొన్ని కారణాల వల్ల ఆయన రాజ్యసభ సీటు, వైసీపీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంది. మే 9న ఎన్నికల జరగనుంది. విపక్షానికి సీట్లు లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక జరగనుంది.

రాజ్యసభ సీటు కోసం పోటీ

ఏపీలో రాజ్యసభ, మండలిలో ఒక్క సీటు ఖాళీ అయినా కూటమిలో నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. నార్మల్‌గా టీడీపీలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఓ వైపు జనసేన, మరోవైపు బీజేపీ ఉండడంతో ఆశావహులు సంఖ్య  అమాంతంగా పెరిగింది. ఇటీవల వైసీపీ, ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఆ సీటుకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేసింది.

ఇప్పటికే ఆశావహులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కలిసి తమకే ఇవ్వాలని రిక్వెస్టులు పెట్టుకున్నారు. నామినేషన్‌కు సమయం ఉండడంతో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు రేపో మాపో భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

బీజేపీ పెద్దలు ఏమంటున్నారు?

విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో మాంచి సంబంధాలు ఉండడంతో ఏం చెయ్యాలా అనే దానిపై టీడీపీ-జనసేనలు తర్జనభర్జన పడుతున్నాయి. సొంతంగా నిర్ణయం తీసుకుంటే లేనిపోని సమస్య వస్తాయని  భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీటు విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలను ఒక్కసారి కలిసి మాట చెబితే వాళ్లు తమ నిర్ణయాన్ని చెబుతారని అంటున్నారు.

ALSO READ: వీఎస్ఆర్ స్థాయి కోసం బుగ్గన కుస్తీ.. ఎందుకు?

చంద్రబాబు-పవన్ కల్యాణ్ సమావేశం తర్వాత ఓ నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత ఢిల్లీ పెద్దలకు చెబితే బాగుంటుందని అంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. విజయసాయిరెడ్డి బీజేపీ వైపు వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయన కమలం గూటికి వెళ్తే ఆ సీటు ఆయనకే ఇవ్వాల్సి ఉంటుంది.

గతంలో బీసీ నేత ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసి, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. మళ్లీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చిన విషయాన్ని  గుర్తు చేస్తున్నారు. అదికాకుండా బీజేపీ పెద్దలు ఎవరినైనా రాజ్యసభకు పంపాలని భావిస్తే.. ఆ సీటు వారికి ఇవ్వాల్సి వుంటుంది. ఎలా చూసినా సీటుపై బీజేపీ నుంచి నిర్ణయం రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టీడీపీ నుంచి రేసులో

బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు లేకుంటే అప్పుడు ఆ సీటును టీడీపీకి కేటాయించడం ఖాయమని అంటున్నారు. టీడీపీ నుంచి చాలామంది సీనియర్లు రాజ్యసభకు వెళ్లాలని తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాజీ ఆర్థికమంత్రి, సీనియర్ నేత ఎనమల రామకృష్ణుడు పెద్దల సభకు వెళ్లాలని ఎప్పటినుంచో  భావిస్తున్నారు. ఈ విషయాన్ని అధినేత వద్ద పలుమార్లు ప్రస్తావించారు.

రాజ్యసభ సీటు కోసం ఉత్తరాంధ్ర నుంచి ఒకరు,  ఉభయగోదావరి జిల్లాల నుంచి మరొకరు, కృష్ణా-గుంటూరు జిల్లాల ఇద్దరు, రాయలసీమ నుంచి మరొకరు పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వారంలో సీటు ఎవరికి అన్నది ఫైనల్ కానుందని అంటున్నారు. అప్పటివరకు సస్పెన్షన్ తప్పదని అంటున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×