E-Paper
Advertisement

కాల్వలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువతీయువకులు గల్లంతు, పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కాల్వలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువతీయువకులు గల్లంతు, పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement

West Godavari Accident: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద ఓ కారు అదుపు తప్పి పక్కనేవున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు యువతీయువకులు గల్లంతు అయ్యారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది?

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి పక్కనేవున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. గల్లంతు అయినవారిలో లక్ష్మీభాను-18 ఏళ్లు, రాజారాం-17, నాగిరెడ్డి దుస్వంత- 18, సాయి సూర్య-19 గల్లంతు అయినవారిలో ఉన్నారు.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు

Advertisement

తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురు యువతీయువకులు ఫ్రెండ్ పెళ్లి కోసం పెరవని వెళ్లారు. అక్కడ మ్యారేజ్ తర్వాత స్నేహితుడ్ని కలవడానికి ఓ గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ప్రయాణించే దారిలో భారీగా వర్షం పడుతోంది. దారి కనిపించపోవడంతో అదుపుతప్పిన కారు, రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. నీరు ప్రవాహానికి నలుగురు కొట్టుకుపోయారు.

నలుగురు యువతీయువకులు గల్లంతు

ఓ యువకుడు చెట్టు కొమ్మ పట్టుకుని స్థానికుల సహకారంతో బయటపడ్డాడు. స్థానికులు ట్రాక్టర్ సహకారంతో కారుని బయటకు తీశారు. ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్, మిగతా నలుగురికి ఫోన్ చేసినప్పటికీ పని చేయలేదు. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గల్లంతు అయివారి కోసం గాలింపు చేపట్టారు. ఘటన గురించి తెలియగానే యువతీయువకుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Advertisement

ALSO READ: శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

Related News

శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

చోడవరంలో దారుణం.. భర్తను నరికి చంపి, తల వద్ద దీపం పెట్టిన భార్య!

గుండెల్లో బలమైన అజెండా ఉండాలి.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

తిరుపతి స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత.. అప్రమత్తమైన కలెక్టర్, ఎస్పీ!

ఏపీలో మెగా DSC అక్రమాల సెగ.. నలుగురు టీచర్లు సస్పెండ్!

చంద్రబాబు ప్రభుత్వంపై బొత్స ఘాటు వ్యాఖ్యలు.. మళ్లీ బ్రిటీష్ పాలన తలపించేలా..

పెమ్మసాని ఫొటో మార్ఫింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అంబటికి హైకోర్టు సమన్లు!

Big Stories

Advertisement
×