West Godavari Accident: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద ఓ కారు అదుపు తప్పి పక్కనేవున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు యువతీయువకులు గల్లంతు అయ్యారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది?
పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి పక్కనేవున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. గల్లంతు అయినవారిలో లక్ష్మీభాను-18 ఏళ్లు, రాజారాం-17, నాగిరెడ్డి దుస్వంత- 18, సాయి సూర్య-19 గల్లంతు అయినవారిలో ఉన్నారు.
తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురు యువతీయువకులు ఫ్రెండ్ పెళ్లి కోసం పెరవని వెళ్లారు. అక్కడ మ్యారేజ్ తర్వాత స్నేహితుడ్ని కలవడానికి ఓ గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ప్రయాణించే దారిలో భారీగా వర్షం పడుతోంది. దారి కనిపించపోవడంతో అదుపుతప్పిన కారు, రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. నీరు ప్రవాహానికి నలుగురు కొట్టుకుపోయారు.
ఓ యువకుడు చెట్టు కొమ్మ పట్టుకుని స్థానికుల సహకారంతో బయటపడ్డాడు. స్థానికులు ట్రాక్టర్ సహకారంతో కారుని బయటకు తీశారు. ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్, మిగతా నలుగురికి ఫోన్ చేసినప్పటికీ పని చేయలేదు. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గల్లంతు అయివారి కోసం గాలింపు చేపట్టారు. ఘటన గురించి తెలియగానే యువతీయువకుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ALSO READ: శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!