BigTV English
Advertisement

Ganta Srinivas Rao : ఈ ఒక్క ఫొటో చాలు.. జగన్ పై గంటా సెటైరికల్‌ ట్వీట్‌..

Ganta Srinivas Rao : ఈ ఒక్క ఫొటో చాలు.. జగన్ పై గంటా సెటైరికల్‌ ట్వీట్‌..

Ganta Srinivas Rao : ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఒకవైపు వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తోంది. మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికి మేనిఫెస్టోపై కసరత్తు చేసేందుకు ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిర్ణయించారు. దీంతోపాటు మొత్తం 11 అంశాలతో మేనిఫెస్టోలో చేర్చాలని తీర్మానించారు.


మరోవైపు వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ‘వై ఏపీ హేట్స్‌ జగన్‌’ అంటూ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల ఇవే అంటూ చాలా అంశాలను ఫోటోలో పొందుపర్చారు.

నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో చేసిన ఘన కార్యాలను చెప్పడానికి ఈ ఒక్క చిత్రం సరిపోతుందని జగన్ మోహన్ రెడ్డి.. అంటూ గంటా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘ఏపీ హేట్స్‌ జగన్‌’, ‘వద్దు వద్దు.. ఈ జగన్’ ‘మళ్లీ మా కొద్దు ఈ జగన్‌’ అని ప్రజలు ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ ?’’ అని సెటైర్ వేశారు.వైసీపీ నేతలు ఏపీకి జగనే ఎందుకు కావాలి అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి కౌంటర్ గా గంటా శ్రీనివాసరావు ఈ పోస్టర్‌ను ట్విటర్‌ లో ఫోటో షేర్‌ చేశారు.


Related News

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

Big Stories

×