BigTV English
Advertisement

Snake Bite: పాము కాటుతో అమ్మాయి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Snake Bite: పాము కాటుతో అమ్మాయి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Snake Bite: ఈ మధ్య పాముల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వానకాలం స్టార్ట్ అయ్యిందంటే చాలు పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇళ్లల్లోకి పాములు వచ్చి భయబ్రాంతకులు గురిచేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పాముల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంటి చుట్టూ చెత్తాచెదారం ఎక్కువగా ఉన్న పాములు ఇంట్లో సంచరిస్తాయి. తాజాగా పాము కాటుతో ఓ అమ్మాయి మృతిచెందింది.


శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మున్సిపాలిటీలోని అమీన్ సాహెబ్ పేటలో ఆదివారం రోజున రాత్రి ఇంటి సభ్యులు తలగాన పూజ (27), వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలు నిద్రిస్తున్నారు. ఆ సమయంలో పాము ఇంట్లోకి దూరింది. వీరి నిద్రిస్తున్న సమయంలో పాము ముగ్గురుని కాటు వేసింది. దీంతో తలగాన పూజ ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శావసానపుట్టుగ గ్రామానికి చెందిన తలగాణ పూజ అనే అమ్మాయి అమీన్ సాహెబ్ పేటలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టకు అమ్మమ్మ గారి ఇంటికి వచ్చింది. దీంతో గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి వరకు కుటంబ సభ్యులు ఆలయ ప్రతిష్టకు సంబంధించి కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో ఉడుకపోతగా ఉండడంతో.. ఇంటి బయట వరండాలో నిద్రించారు.

ALSO READ: Cobra Snake: దేవుడా.. ఇంత పెద్ద నాగుపాము ఇంట్లోకి వచ్చి.. బుసలు కొడుతూ, వీడియో వైరల్


వాళ్లు వరండాలో నిద్రించడమే.. శాపంగా మారింది. భారీ పాములు నిద్రిస్తున్న ముగ్గురిని కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఇచ్చాపురం గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తరలించే క్రమంలో మార్గ మధ్యంలోనే తలగాని పూజ చనిపోయింది. వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలను ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ALSO READ: Covid-19 India: దేశంలో 4000 దాటిన కోవిడ్ కేసులు.. పెరుగుతున్న మరణాల సంఖ్య

వర్షాకాలం ప్రారంభం కావడంతో పాములు ఎక్కువగా సంచరించే అవకాశం ఉంది. రాత్రి వేళ ఇంట్లోనే నిద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి చుట్టు పక్కల చెత్త, చెదారం, పాత సామాగ్రి ఉంచుకోవద్దని చెబుతున్నారు. భారీ వర్షాలు పడుతున్న క్రమంలో వరదల్లో కూడా పాములు కొట్టుకువచ్చే ఛాన్స్ ఉందని.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×