E-Paper
Advertisement

Heavy Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఈ నెల 27 వరకు భారీ వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఈ నెల 27 వరకు భారీ వర్షాలు

Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరింత బలపడటంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. జులై 27వ తేదీ వరకు కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని.. అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచనలు చేశారు.

బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య భాగంలో అల్పపీడనం
క్రమంగా బలపడుతూ.. బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ కారణంగా తూర్పు తీర రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మరింత ఉధృతంగా పడే అవకాశం ఉంది.

నేడు ఎక్కడెక్కడ భారీ వర్షాలు?
జులై 25న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో.. భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు నమోదు కావచ్చని అంచనా. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది. విద్యుత్ సమస్యలు, రోడ్డు జామ్‌లు, వరద ముప్పు వంటి పరిణామాలపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

మిగతా జిల్లాల్లో పరిస్థితి
నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, తూర్పు రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మెరుగైన మేఘాలు కనిపించవచ్చని, తక్కువ స్థాయిలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.

మత్స్యకారులకు హెచ్చరిక
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. గాలులు 40–50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున, సముద్రం లోపలికి ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించారు. తీరం వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నవారు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలి.

విద్యుత్ తీగల దగ్గర నుంచి దూరంగా ఉండాలి

అవసరం లేనివేళ బయటకు వెళ్లకపోవడం మంచిది

అధికారుల సూచనలు పాటించడం ముఖ్యం

దుర్ఘటనలు జరిగినా వెంటనే 112 లేదా స్థానిక రెస్క్యూ నంబర్లకు సమాచారం ఇవ్వాలి

ప్రభుత్వం చర్యలు
రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే.. అన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలకు సంబంధించి NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచారు. లోతట్టు ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. అవసరమైతే సహాయ కేంద్రాలు కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.

Also Read: ఏపీలో రూ.79,900 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

తాత్కాలికంగా ముందు జాగ్రత్తే రక్షణ
బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో.. వచ్చే వర్షాలు పొలాలకూ, తాగునీటి వనరులకూ ఉపయోగపడొచ్చు. అయితే వర్షపాతం తీవ్రత ఎక్కువైతే సాధారణ జీవనాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం, అధికారుల సూచనలు పాటించడం చాలా ముఖ్యం. ముందస్తు సమాచారం ఉన్నప్పుడే పలు ప్రమాదాలను నివారించవచ్చు. కాబట్టి తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×