E-Paper
Advertisement

PSLV-C59 Launch: పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం వాయిదా.. సాంకేతిక లోపాన్ని గుర్తించిన స్పేస్.. మళ్లీ ఎప్పుడంటే?

PSLV-C59 Launch: పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం వాయిదా.. సాంకేతిక లోపాన్ని గుర్తించిన స్పేస్.. మళ్లీ ఎప్పుడంటే?
Advertisement

PSLV-C59 Launch: కాసేపట్లో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం ప్రారంభమయ్యే సమయంలో ఇస్రో కీలక ప్రకటన చేసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ముందుగా ఇస్రో తెలిపింది. నేటి సాయంత్రం 4:08 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం లాంచ్ ప్యాడ్ 1 వీటిని నింగిలోకి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయగా, శాటిలైట్‌లో సాంకేతిక సమస్యతో ప్రయోగం వాయిదా పడింది.

సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన బృహత్తర మిషన్ కాగా, ఇస్రో సహకారంతో సూర్యుడి బాహ్య వలయం కొరొనా గురించి తెలుసుకునే ప్రయత్నం సాగించేందుకు ఈ ప్రయోగం దోహద పడనుంది. అక్కడి వాతావరణం, ప్లాస్మా, అయానైజ్డ్ గ్యాస్.. వంటి అంశాలపై ఈఎస్ఏ అధ్యయనం చేయడం ప్రయోగం ముఖ్య లక్ష్యం.

Advertisement

అయితే మరికొద్ది గంటల్లో రాకెట్ ప్రయోగం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సాగాయి. కానీ అంతలోనే శాటిలైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కౌంట్‌డౌన్‌ నిలిపివేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ రాకెట్ ను రేపు సాయంత్రం 4.12 గం.కు ప్రయోగించడం జరుగుతుందని ప్రకటన జారీ చేసింది.

Also Read: Mahalakshmi Foundation: ఆ ఊరే ఓ అద్భుతం.. ఆడపిల్ల పుడితే అక్కడి సంప్రదాయమే వేరు..

Advertisement

కాగా నేటి సాయంత్రం ప్రయోగం సఫలమయ్యేందుకు ఇస్రో సన్నద్దం కాగా, ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సమస్యను గుర్తించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వెంటనే ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం రేపు సాగుతుండగా, సూర్యుడిపై పరిశోధనల కోసం దీనిని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు శాస్త్రవేత్తలు. రాకెట్ ప్రయోగం వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలివచ్చారు. అయితే ప్రయోగం వాయిదా వేసినట్లు తెలుసుకున్న వారు, రేపు అనగా గురువారం రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×