Janasena Committee: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల రూపకల్పనకు జనసేన కమిటీని నియమించారు. దీనికోసం 14 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన విధి విధానాలు రూపకల్పనకి ప్రత్యేక కమిటీని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఈ కమిటీలో మోత్తం 14 మంది సభ్యులను నియమించారు. విధి విధానాలతోపాటు క్షేత్ర స్థాయిలో శ్రేణుల ఆలోచనలను ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ జనసేన శాసన సభ పక్షం సమావేశంలో జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా వారి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుదామని పిలుపునిచ్చారు.
Also Read: కెమెరా హిస్టరీలోనే బిగ్ చేంజ్.. 68MP స్క్వేర్ సెల్ఫీ కెమెరాతో వస్తున్న కొత్త ఫోన్ ఇదే!
1. శ్రీ మండలి బుద్ధ ప్రసాద్
2. శ్రీ టి.శివ శంకర్
3. శ్రీ కందుల దుర్గేష్
4. శ్రీ వల్లభనేని బాలశౌరి
5. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్
6. శ్రీ దేవ వరప్రసాద్
7. శ్రీ సీహెచ్ వంశీకృష్ణ యాదవ్
8. శ్రీమతి లోకం మాధవి
9. శ్రీ పత్సమట్ల ధర్మ రాజు
10. శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి
11. శ్రీ కొటికలపూడి గోవిందరావు (చినబాబు)
12. శ్రీ సామినేని ఉదయభాను
13. శ్రీ యనమల భాస్కర్
14. శ్రీ కొరికాన రవి కుమార్
Also Read: Jio రూ.299 vs Airtel రూ.349.. రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్.. దేనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ?