Jogi Ramesh: వైసిపి నేత మాజీ మంత్రి జోగి రమేష్ అతని కుటుంబ సభ్యులకు కోర్టులో భారీ ఊరట లభించింది. మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన కుమారుడు జోగి రాజీవ్ సహా వారి కుటుంబ సభ్యులపై నమోదైన గృహ హింస మరియు వరకట్న వేధింపుల కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Also read: అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?
ఈ కేసులో బాధితురాలు మేఘన లేదా సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించడం, ప్రభావితం చేయడం లేదా ప్రలోభపెట్టడం చేయకూడదని కోర్టు తెలిపింది. విచారణాధికారి సూచించిన తేదీలు, సమయాల్లో సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణకు హాజరుకావాలని తెలిపింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా సంబంధిత పరిధి లేదా ప్రాంతాన్ని దాటి వెళ్లకూడదనీ ఆంక్షలతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది.
Also read: గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా హైదరాబాద్.. కేంబ్రిడ్జ్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక భేటీ!