E-Paper
Advertisement

చంద్రగిరిలో ఏనుగుల రచ్చ.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

చంద్రగిరిలో ఏనుగుల రచ్చ.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
Advertisement

Elephant Movement: చంద్రగిరి సమీపంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. దీంతో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏనుగుల కదలికలపై డ్రోన్లతో నిరంతర నిఘా పెట్టలని అన్నారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీ పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మైకులు, మొబైల్ సందేశాల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలన్నారు.

పంట నష్టంపై నివేదికలు..

సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రివేళ పొలాలకు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన చోట H.A.N.U.M.A.N. బృందాలను మోహరించాలని పవన్ ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏనుగుల దాడుల్లో పంట నష్టంపై తక్షణ నివేదికలు రూపొందించాలని, పంట నష్టానికి అటవీశాఖ ద్వారా తక్షణ పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పవన్ వెల్లడించారు.

Advertisement

Also read: తెలంగాణ రాష్ట్రంలో డేంజర్ బెల్స్.. పంజా విసురుతున్న విష జ్వరాలు

గుంపులుగా ఏనుగులు..

ఏనుగుల కదలికల నేపథ్యంలో అటవీశాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎర్రవారిపాలెం పరిసరాల్లో రెండు గుంపులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. రాత్రివేళ పంట పొలాల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నాయి. పంటలు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు పవన్ ఆదేశిచారు. అటవీశాఖ సూచనలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

 Also read: జాతీయ కుల గణనపై కేంద్రం కుట్రను బట్టబయలు చేసిన మంత్రి పొన్నం!

Tags

Related News

తాడిపత్రిలో ఊహించని ఘటన.. నిశ్చితార్థ వేడుకలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాళ్ల దాడి!

దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబే: మాజీ మంత్రి రోజా

యారాడ బీచ్‌లో టూరిస్టులకు తప్పిన ప్రమాదం.. మహిళను రక్షించిన బీచ్ లైఫ్‌గార్డ్స్

తిరుమల భక్తులకు అలర్ట్.. మంగళవారం శ్రీవారి సేవా టికెట్లు విడుదల, నవంబర్ కోటా

భోగాపురం ఎయిర్‌పోర్టు.. అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు, బస్సుల ఛార్జీల మాటేంటి?

చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిన ధరలు, అదే కారణమా?

అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. వైసీపీని ఎండగడుతూ, ఏ రోజుకు ఆ రోజు

Big Stories

Advertisement
×