Elephant Movement: చంద్రగిరి సమీపంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. దీంతో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏనుగుల కదలికలపై డ్రోన్లతో నిరంతర నిఘా పెట్టలని అన్నారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీ పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మైకులు, మొబైల్ సందేశాల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రివేళ పొలాలకు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన చోట H.A.N.U.M.A.N. బృందాలను మోహరించాలని పవన్ ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏనుగుల దాడుల్లో పంట నష్టంపై తక్షణ నివేదికలు రూపొందించాలని, పంట నష్టానికి అటవీశాఖ ద్వారా తక్షణ పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పవన్ వెల్లడించారు.
Also read: తెలంగాణ రాష్ట్రంలో డేంజర్ బెల్స్.. పంజా విసురుతున్న విష జ్వరాలు
ఏనుగుల కదలికల నేపథ్యంలో అటవీశాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎర్రవారిపాలెం పరిసరాల్లో రెండు గుంపులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. రాత్రివేళ పంట పొలాల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నాయి. పంటలు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు పవన్ ఆదేశిచారు. అటవీశాఖ సూచనలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also read: జాతీయ కుల గణనపై కేంద్రం కుట్రను బట్టబయలు చేసిన మంత్రి పొన్నం!