E-Paper
Advertisement

Road roller: విషాదం.. ఒకరి నిర్లక్ష్యం.. ఇద్దరు యువకులు బలి!

Road roller: విషాదం.. ఒకరి నిర్లక్ష్యం.. ఇద్దరు యువకులు బలి!

Road roller accident Two young people are victims: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం మరో గ్రామానికి వెళ్లిన ఇద్దరు యువకులను రోడ్ రోలర్ డ్రైవర్ నిర్లక్ష్యం బలి తీసుకుంది. పని ముంగించుకొని నిద్రిస్తున్న ఆ ఇద్దరు యువకులపై రోడ్ రోలర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం గ్రామ సమీపంలో ఓ కంపెనీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. ఈ కంపెనీలో పనిచేసేందుకు అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తమ కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని వెళ్లారు. అక్కడ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీలోనే రాత్రి వాచ్‌మెన్‌గా చేరారు. అయితే ఇంతలోనే విషాదం ఆ ఇద్దరిని వెంటాడింది.

బెంగళూరు నుంచి చెన్నై రహదారి రోడ్డులో రాత్రి వాచ్ మెన్ గా అషరఫ్, సాదిక్ ఇద్దరు పనిలో చేరారు. పని పూర్తయిన తర్వాత ఇద్దరు కొంత సేపు నిద్ర పోదామని అనుకున్నారు. ఇంతలో డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడు రోలర్ నడపడంతో వారిద్దరిపై వెళ్లిందిత. దీంతో ఇద్దరూ మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోయాడు.

Also Read: పవన్ పై వ్యతిరేకత.. తమిళనాడులో రోజా బిజి బిజీ, ప్లాన్ ‘అదిరింది’

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విగతజీవులుగా పడిన వారిని చూసి రోదించారు. నెలకు రూ.11వేలకు ఇద్దరూ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి రోదనలు అందరినీ కంటతడిపెట్టించాయి.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×