E-Paper
Advertisement

Roja: వైసీపీ నేత రోజా లోగుట్టు బయటకు.. ఆ మహిళ ఎవరో తెలుసా? అందుకే జగన్ సైలెంట్

Roja: వైసీపీ నేత రోజా లోగుట్టు బయటకు.. ఆ మహిళ ఎవరో తెలుసా? అందుకే జగన్ సైలెంట్
Advertisement

Roja: తప్పు చేస్తే అప్పటికి మాత్రమే.. కొద్దిరోజుల తర్వాతైనా బయటపడుతుంది. మాజీ మంత్రి రోజా విషయంలో అలాంటిదే జరిగింది. ఈమె గుట్టుని బట్టబయలు చేసింది టీడీపీ. ఇంతకీ మాజీ మంత్రి చేసిన తప్పేంటి? ఈ విషయంలో పార్టీ అధినేత జగన్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

వైసీపీ పాలన గురించి చెప్పనక్కర్లేదు. ఏ శాఖ పట్టుకున్నా అవినీతి కంపు కొడుతోందని కూటమి నేతలు పదేపదే చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది ఆ పార్టీలోని చాలామంది నేతల మెడకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. అందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి. రేపో మాపో మాజీ మంత్రి రోజా కూడా బుక్కవ్వడం ఖాయమనే వాదన లేకపోలేదు.

Advertisement

అన్నట్లు రెండువారాల కిందట మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు. ఏపీలో దొంగ ఓట్ల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు నోరు మెదపలేదంటూ ప్రశ్నించారు. అందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, ఇన్‌ఛార్జ్ మాణిక్యాం ఠాగూర్ గట్టిగా కౌంటరిచ్చారు. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం.

మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా ఆగడాలను బయటపెట్టింది టీడీపీ. నగరి మున్సిపాలిటీ ఆరో వార్టు వైసీపీ కౌన్సిలరుగా ఐశ్వర్య ఏకగ్రీవమైంది.  వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు జరిగాయి. అందులో కనిపిస్తున్న మహిళ కూడా ఉంది. దొంగ పేరుతో తమిళనాడు నుంచి ఏపీకి దిగుమ‌తి అయ్యిందట ఆమె.

Advertisement

ALSO READ: విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్

రోజా పక్కన సర్కిల్‌లో కనిపిస్తున్న ఆమె పేరు ఐశ్వర్య. తమిళనాడులో ఉంటున్న ఆమెకు అదే పేరుతో త‌మిళ‌నాడులో ఓట‌ర్ కార్డు ఉంది. నగరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆమెని సాయి సంధ్యారాణి పేరు మార్చేసింది వైసీపీ. ఫేక్ ఓటర్ కార్డు సృష్టించిన వైసీపీ, ఆమెని ఏకంగా నగిరి కౌన్సిలరుగా ఏకగ్రీవం చేశారు ఆనాటి మంత్రి రోజా.

ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో బయటపెట్టింది టీడీపీ. ఇది కేవలం టీడీపీ బయటకు తీసుకొచ్చిన విషయం మాత్రమే. తెలీకుండా ఇలాంటికి ఇంకా ఎన్ని ఉన్నాయోనంటూ చర్చించుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. దొంగ ఓట్ల గురించి మనకు మాట్లాడే అర్హత లేదని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు.

అందుకోసమే నకిలీ ఓట్లపై కనీసం అధినేత జగన్ నోరెత్తలేదని అంటున్నారు. ఆయన నోరెత్తితే ఇలాంటివి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. మొత్తానికి రోజా అడ్డంగా దొరికిపోయిందనే చెప్పాలి. మరి టీడీపీ బయటపెట్టిన ఆ ఫోటోలు, డీటేల్స్‌పై రోజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×