RTC Depot Scam: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్టీసీ డిపోలో భారీ కుంభకోణం జరిగింది. సుమారు 30 లక్షల వరకు క్యాష్ గల్లంతైనట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఆర్టీసీ డిపోలోపనిచేస్తున్న క్లర్క్ రెండేళ్లుగా చేస్తున్న బాగోతం బట్టబయలైంది.
రోజుకి పదిమంది డ్రైవర్లు డ్యూటీ చేస్తే, మరో ఐదుగురు డ్రైవర్లు డ్యూటీ చేసినట్లు రికార్డులు రాసి ఆ ఐదుగురు డ్రైవర్ డబ్బులు కాజేసినట్లు ప్రాథమిక విషయాల్లో బహిర్గతమైంది. ఇటీవల డిపో మేనేజర్గా బాధ్యతలు తీసుకున్న మూర్తి డబ్బులు పేమెంట్ రికార్థులను పరిశీలిస్తుండగా అనుమానంతో విజిలెన్స్ కు ఫిర్యాదు చేయడంతో కుంభకోణం బైటపడింది.
Also Read: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు!
డిపోలో క్లర్క్గా పనిచేస్తున్న ఎ పి కె రావు ఈ స్కాం కి పాల్పడినట్లు ఆర్టీసీ సంస్థ విజిలెన్స్,ఆడిటర్స్ తెలిపారు. గత రెండేళ్లుగా ఈ వ్యవహారం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం ఎ పి కె రావుకు తెలియడంతో విధులకు గైర్హాజరై, ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారానికి భాధ్యుడైన ఎ పి కె రావు పై రామచంద్రపురం పోలీసులకు డిపో మేనేజర్ మూర్తి ఫిర్యాదు చేశారు.
Also Read: 18 ఏళ్లకే హీరోయిన్ గా.. షావుకారు జానకి నటించిన చివరి తెలుగు చిత్రం!