E-Paper
Advertisement

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ భేటీ, టీటీడీతోపాటు..

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ భేటీ, టీటీడీతోపాటు..
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇరువురు మధ్య దాదాపు అరగంట సేపు సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులతోపాటు టీటీడీ గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు రెండురోజులుగా హైదరాబాద్‌లో వున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్.. సీఎం చంద్రబాబును హైదరాబాద్ నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో తిరుమల లో శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్టు తెలిపారు.

Advertisement

అలాగే టీటీడీలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ శాసనసభ్యులకు అర్హత కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. శాసనసభ్యుల రిక్వెస్టును ఆమోదించాలని కోరారు.

ALSO READ: రైతులకు గుడ్ న్యూస్.. కాసేపట్లో ధ్యానం బకాయిలు విడుదల

Advertisement

తిరుమల దర్శన కోసం తెలంగాణ నుంచి భక్తులు లక్షల్లో వెళ్తుంటారు. అయితే భక్తుల కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు అందించే సిఫార్సు లేఖలను ఆమోదించాలన్నది కోరుతున్నారు. ఎప్పటినుంచో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్టును ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరోవైపు తెలంగాణలో టీడీపీ బలోపేతంపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. రేపోమాపో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడ్ని నియమించనున్నారు. ఇటీవల జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. తెలంగాణలోని నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత అధ్యక్షుడ్ని ప్రకటించే ఛాన్స్ ఉంది.

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×