E-Paper
Advertisement

Vishaka Metro Rail: వైజాగ్ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక నగరంలో మెట్రో పరుగులే పరుగులు..

Vishaka Metro Rail: వైజాగ్ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక నగరంలో మెట్రో పరుగులే పరుగులు..
Advertisement

Vishaka Metro Rail: ఏపీలో మెట్రో రైలు కూత వినిపించనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇప్పటికే మెట్రో రైల్ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహింపబడుతున్న నేపథ్యంలో, ఏపీలో కూడా మెట్రో రైలు సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తాజాగా వైజాగ్ లోనూ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విజయవాడలో మెట్రో రైలు లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, అదే తరహాలో వైజాగ్ లోనూ మెట్రో ప్రాజెక్ట్ చేపట్టనుంది. ఈ ప్రకటనపై వైజాగ్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖపట్నం కేంద్రంగా ఎన్నో పరిశ్రమలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు రోజురోజుకి ట్రాఫిక్ సమస్య కూడా విశాఖ నగర ప్రజలను వేధిస్తోంది. నగర జనాభా కూడా అంతే స్థాయిలో రోజురోజుకు పెరుగుతుండగా, రవాణా వ్యవస్థకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. వైజాగ్ అభివృద్ధి లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తొలిసారిగా కీలక నిర్ణయం తీసుకుంది. అదే వైజాగ్ లోనూ మెట్రో రైలు పరుగులు..

Advertisement

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు మొదటి దశ డీపీఆర్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ డీపీఆర్ లో భాగంగా మూడు కారిడార్ల నిర్మాణం, 46.23 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. ఆ మూడు కారిడార్లలో ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు మొత్తం 33.4 కిలోమీటర్లు, రెండవది గురుద్వారా నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08 కిలోమీటర్లు, మూడవది తాడి చెట్ల పాలెం నుండి చిన్న వాల్తేర్ వరకు 6.75 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: Ganja Chocolates: మీ పిల్లలు చాక్లెట్స్ తింటున్నారా.. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి

Advertisement

అయితే ఈ మూడు కారిడార్ల నిర్మాణానికి మొత్తం రూ. 11498 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా. ఏది ఏమైనా విశాఖ నగరంలో అతి త్వరలోనే మెట్రో పరుగులు తీయనుందని చెప్పవచ్చు. మెట్రో రాకతో ట్రాఫిక్ సమస్యతో పాటు, నగరానికి కొత్త కళ సంతరించుకుంటుందని వైజాగ్ ప్రజలు తమ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×