BigTV English

Visakhapatnam: విశాఖ లో వాటర్ బంద్.. అల్లాడుతున్న నగర వాసులు

Visakhapatnam: విశాఖ లో వాటర్ బంద్.. అల్లాడుతున్న నగర వాసులు

Visakhapatnam: విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ ఏర్పడింది. GVMC పరిధిలో వాటర్ సప్లై నిలిచిపోవడంతో నగర ప్రజలు, పరిశ్రమలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఆప్కాస్‌ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. దీంతో 3 లక్షల ఇంటి కులాయిలు సహా పలు కీలక పరిశ్రమలకు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఉదయం 5 గంటల నుంచి కులాయిలు రావాల్సి ఉన్నప్పటికీ నీటి సరఫరాకు బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో పలు కాలనీల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.


తాత్కాలికంగా నిలిపిన ప్రధాన నీటి మూలాలు:

ప్రముఖంగా ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ వంటి ప్రధాన జలాశయాల నుంచి.. వచ్చే నీటి సరఫరాను ఉద్యోగులు నిలిపివేశారు.  జీవీఎంసీ పరిధిలోని ట్యాంకులు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ట్యాంకులను తిరిగి నింపాలంటే కనీసం.. 10 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఉద్యోగుల నిరసన – సాంకేతిక సమస్యల హెచ్చరిక:
జీవీఎంసీ ఉద్యోగులతో కలిసి ట్యాంకులను నింపే ప్రయత్నం చేసినా, వాటర్ సప్లై శాఖ ఉద్యోగులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తగిన అనుభవం లేని వారితో పంపింగ్ చేపడితే సాంకేతిక లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. నిన్న రాత్రి వరకు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె కొనసాగుతోంది.

ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో:
ఉదయం నుంచే ప్రజలు బకెట్లతో గుంపులుగా నీటి కోసం ఎదురుచూస్తున్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు కూడా నీటి కొరతతో బాధపడుతున్నాయి. మంచి నీళ్ళు లేక గ్రేటర్ విశాఖ జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే సమస్యకు పరిష్కారం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే టైంలో మేయర్‌తో మరోసారి చర్చలకు వెళ్ళనున్నారు వాటర్ సప్లై ఎంప్లాయిస్ యూనియన్ నేతలు. చర్చలు సఫలం అయితేనే నీటిని విడుదల చేస్తామంటున్న ఉద్యోగులు చెబుతున్నారు.

తాత్కాలిక భద్రతా చర్యలు:
GVMC తరఫున ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నా, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది తక్కువగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారి స్థాయిలో సమావేశాలు జరిగి, ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.

Also Read: ఆ స్పీడ్ లేదు, ఆ ఫైర్ లేదు.. గుడివాడలో కొడాలి సైలెంట్ ఎంట్రీ

విశాఖ నగరం ప్రస్తుతం నీటి విషయంలో.. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని, ప్రజల ప్రాథమిక అవసరమైన నీటి సమస్యకు.. శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Related News

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

Big Stories

×