E-Paper
Advertisement

YSRCP on Chandrababu: భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సూట్‌కేసులు!.. చంద్రబాబు లక్ష కోట్ల దోపిడీ!.. వైసీపీ సంచలనం

YSRCP on Chandrababu: భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సూట్‌కేసులు!.. చంద్రబాబు లక్ష కోట్ల దోపిడీ!.. వైసీపీ సంచలనం
Advertisement
YCP leaders comments on Chandrababu naidu

YCP leaders comments on Chandrababu naidu(AP politics) :

వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. చంద్రబాబుపై విమర్శల దాడి పెంచారు. వంద కోట్ల సొమ్ముకు లెక్కలు చూపెట్టాలంటూ చంద్రబాబుకి ఐటీ నోటీసులు వచ్చాయంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐటీ నోటీసులపై నోరు మెదపాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నాయి. అమరావతి పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు.

అయితే, టీడీపీ అధినేత నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మాజీ మంత్రి కొడాలి నాని మరింత డోసు పెంచారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని.. లక్ష కోట్లు దోచుకున్నారని అన్నారు. సింగపూర్‌లో ఆయనకు హోటల్స్ ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

ఎన్నికల్లో డబ్బు పంచడం నేర్పిన వ్యక్తి చంద్రబాబేనని.. 1999లోనే ఒక్కో అభ్యర్ధికి రూ.కోటి ఇచ్చారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో రూ.10వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమని పార్టీ నేతలకు ఇప్పటికే చంద్రబాబు చెప్పారని.. అంత డబ్బు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. చట్టాలు, వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని దోచుకునే వ్యక్తి అంటూ మండిపడ్డారు కొడాలి నాని.

అటు, మంత్రి రోజా సైతం మరింత మంట రాజేశారు. అమరావతి పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని.. భువనేశ్వరి, బ్రహ్మణి సూట్‌కేసులు అందుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్‌ని జైల్లో వేయాలన్నారు మంత్రి రోజా.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×