E-Paper
Advertisement

YSRCP on Chandrababu: భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సూట్‌కేసులు!.. చంద్రబాబు లక్ష కోట్ల దోపిడీ!.. వైసీపీ సంచలనం

YSRCP on Chandrababu: భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సూట్‌కేసులు!.. చంద్రబాబు లక్ష కోట్ల దోపిడీ!.. వైసీపీ సంచలనం
Advertisement
YCP leaders comments on Chandrababu naidu

YCP leaders comments on Chandrababu naidu(AP politics) :

వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. చంద్రబాబుపై విమర్శల దాడి పెంచారు. వంద కోట్ల సొమ్ముకు లెక్కలు చూపెట్టాలంటూ చంద్రబాబుకి ఐటీ నోటీసులు వచ్చాయంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐటీ నోటీసులపై నోరు మెదపాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నాయి. అమరావతి పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు.

అయితే, టీడీపీ అధినేత నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మాజీ మంత్రి కొడాలి నాని మరింత డోసు పెంచారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని.. లక్ష కోట్లు దోచుకున్నారని అన్నారు. సింగపూర్‌లో ఆయనకు హోటల్స్ ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

ఎన్నికల్లో డబ్బు పంచడం నేర్పిన వ్యక్తి చంద్రబాబేనని.. 1999లోనే ఒక్కో అభ్యర్ధికి రూ.కోటి ఇచ్చారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో రూ.10వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమని పార్టీ నేతలకు ఇప్పటికే చంద్రబాబు చెప్పారని.. అంత డబ్బు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. చట్టాలు, వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని దోచుకునే వ్యక్తి అంటూ మండిపడ్డారు కొడాలి నాని.

అటు, మంత్రి రోజా సైతం మరింత మంట రాజేశారు. అమరావతి పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని.. భువనేశ్వరి, బ్రహ్మణి సూట్‌కేసులు అందుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్‌ని జైల్లో వేయాలన్నారు మంత్రి రోజా.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×