AP BJP Strategy: ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉందా అంటే ఉంది అన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితి వద్దు అనుకుంటున్నారు. సొంతంగా ఎదగాలనుకుంటున్నారు. అయితే ఇది పెద్ద ఛాలెంజే. అంత ఈజీ కాదు. 2024లో లోక్సభలో బీజేపీ 11.2 శాతం ఓట్లు సాధించినా.. అసెంబ్లీలో 2.83 శాతానికే పరిమితమైంది. 2029 నాటికి రాష్ట్రంలో పార్టీకి మంచి సీట్లు తీసుకురావడమే వ్యూహంగా కనిపిస్తోంది.
Also Read: రైతుల ధాన్యంతో మిల్లర్ల దందా.. రికవరీ మొదలుపెట్టిన ప్రభుత్వం!
అందుకే పొత్తు ధర్మం ఒకవైపు.. పొలిటికల్ ఐడెంటిటీ మరోవైపు అన్నట్టుగా నితిన్ నబీన్.. ఏపీ బీజేపీ నేతలకు క్లియర్ రూట్మ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తప్పు చేస్తే మౌనంగా ఉండకూడదు.. ప్రజా సమస్యలపై సొంతంగా నిర్ణయాలు తీసుకుని పార్టీని విస్తరించాలని గైడ్ చేశారంటున్నారు. అయితే అసలు ప్రశ్న.. పొత్తును కాపాడుకుంటూనే సొంత రాజకీయ స్పేస్ను బీజేపీ ఎంతవరకు పెంచుకోగలదు? 2029కి కమలం సొంతంగా బలపడుతుందా.. లేక కూటమి లెక్కల్లోనే కొనసాగుతుందా? చూడాలి.