Bonda Uma: రాజకీయాల్లో ఒక్క మాట.. ఒక్క అడుగు.. ఒక్క కలయిక ఎన్నో మలుపులకు దారి తీస్తుంది. ముద్రగడ సంతాప సభకు బొండా ఉమ వెళ్లినప్పుడు అదే జరిగింది. కాపు అంశంపై ఆయన చేసిన స్టేట్మెంట్స్, అంబటితో ఆత్మీయ ఆలింగనం సొంత పార్టీలోనే దుమారం రేపాయి. దీనికి వైసీపీ వత్తాసు పలకడంతో బొండాపై అధిష్టానానికి ఎక్కడిలేనంత కోపం వచ్చింది. చివరకు హైకమాండ్ పిలిచి మరీ వివరణ అడిగింది.
బొండా ఉమ క్లారిటీ ఇచ్చినా ఆయన ఇమేజ్కి పార్టీలో ఫుల్ డ్యామేజ్ అయ్యింది. ఈ డ్యామేజ్ను కవర్ చేసుకునే చాన్స్ మల్లాది విష్ణు రూపంలో వచ్చింది. ఇంకేముంది ఇమేజ్ బిల్డింగ్ ఆపరేషన్ షురూ చేశారు.మెగా డీఎస్సీ అంశంపై మల్లాది విష్ణు చేస్తున్న దీక్ష వేదిక దగ్గర రౌద్రరూపం ప్రదర్శించారు. అధిష్టానానికి తన విధేయతను చాటుకునేందుకే ఇంత హైడ్రామా చేశారా అని విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తున్న టాక్.
Also Read: అర్హులకు రైతుబంధు సంక్షేమం.. అందరికీ రైతుబంధు ఓటుబ్యాంకు..ఇద్దరూ చేసింది రెండోదే..!
సొంత సామాజికవర్గం వివాదంలో దెబ్బతిన్న పొలిటికల్ ఇమేజ్ను, క్రేజ్ను తిరిగి తెచ్చుకోవడానికే బొండా ఉమ ఈ స్థాయిలో రీ-ఎంట్రీ ఇచ్చారా? అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా నేరుగా శిబిరాల దగ్గరకే వెళ్లి ఆందోళన చెదరగొట్టడం ద్వారా క్యాడర్లో గ్రాఫ్ పెంచుకునే ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఇమేజ్ను నిర్మించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక వివాదం చాలు… ఆ ఇమేజ్కు గీత పడటానికి. ఈ విషయం తెలుసుకున్న బొండా ఉమ.. ఆ గీత చేరిపేయడమే టార్గెట్గా పెట్టుకున్నారా?
Also Read: ఏపీలో ముదిరిన భద్రతా రాజకీయం.. అమిత్ షా వద్ద వైఎస్ జగన్ సెక్యూరిటీ వివాదం!