E-Paper
Advertisement

బిఆర్ఎస్ కొత్త జనతా గ్యారేజ్ వ్యూహం.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్!

బిఆర్ఎస్ కొత్త జనతా గ్యారేజ్ వ్యూహం.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్!
Advertisement

BRS Strategy: సమస్య ఏదైనా సరే.. బాధితుల అడుగు మాత్రం తెలంగాణ భవన్‌ వైపే.. తెలంగాణలో BRS జనతా గ్యారేజ్‌గా మారుతోందా? గతంలో హైడ్రా బాధితులు.. ఆ తర్వాత జీవో-97 రద్దు కోసం విద్యార్థులు.. ఇప్పుడు 22A భూముల బాధితులు, కొడంగల్‌ భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు.. వరుసగా BRSను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్నవారికి తెలంగాణ భవన్‌ ఒక వేదికగా మారుతోందన్న చర్చ మొదలైంది.

BRS కొత్త ఫార్ములా..

ముఖ్యంగా 22A బాధితుల కోసం ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేయడం.. ఫిర్యాదులు స్వీకరించడం, న్యాయపోరాటానికి అండగా నిలవడం చూస్తుంటే సమస్య మీది.. పోరాటం మాది అన్నట్టుగా BRS కొత్త ఫార్ములాను బలంగా ముందుకు తీసుకెళ్తోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాధితులకు అండగా నిలవడం ఒక ఎత్తయితే.. అదే అసంతృప్తిని ప్రభుత్వంపై రాజకీయ అస్త్రంగా మార్చడం మరో ఎత్తుగా కనిపిస్తోంది.

Advertisement

Also Read: కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

అసలు గేమ్‌ ప్లానా?..

హైడ్రా నుంచి 22A వరకు విద్యార్థుల నుంచి కొడంగల్‌ భూ బాధితుల వరకు.. సమస్యలు వేరైనా BRS మాత్రం ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రజా సమస్య ఏదైనా వాటికి పరిష్కారం తెలంగాణ భవన్‌ వద్దే.. అన్న ఇమేజ్‌ తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలతో నష్టపోయామని భావిస్తున్న వర్గాలను తమవైపు తిప్పుకోవడమే అసలు గేమ్‌ ప్లానా? ప్రజా సమస్యలపై పోరాటం పేరుతో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచే ఈ జనతా గ్యారేజ్‌ ఫార్ములా BRSకు ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

Advertisement

Also read: కొడుకుని కాపాడబోయి తండ్రి.. ఇద్దరూ పోయారని భార్య.. ఫ్యామిలీని బలితీసుకున్న స్మార్ట్‌ఫోన్!

Tags

Related News

కాశ్మీర్ కుంకుమ పువ్వు ఇప్పుడు జగ్గయ్యపేటలో.. రిటైర్డ్ శాస్త్రవేత్త వినూత్న ప్రయోగం!

సామాన్యుడికో న్యాయం.. ఎంపీ కొడుక్కో న్యాయమా? ఇనార్బిట్ మాల్ ప్రమాదంపై రగులుతున్న చర్చ!

కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రెడీ..?

జైపూర్ స్కూల్ విజిట్‌లో ఉద్రిక్తత.. సీజేపీ నేత అశుతోష్ రాంకా, కార్యకర్తలపై రాళ్ల దాడి!

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. ఈడీ ఎంట్రీతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో వనుకు!

వరంగల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదా.. బయటపడిన షాకింగ్ సర్వే వివరాలు!

ఏపీ కూటమిలో ముదురుతున్న సీట్ల సమరం.. బీజేపీ, జనసేనల సొంత అజెండా పై ఫోకస్!

Big Stories

Advertisement
×