Bhu Lakshmi Scheme: దళితులకు మూడెకరాలు.. ఈ హామీ గుర్తుందా.. ఇది కేసీఆర్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. సీన్ కట్ చేస్తే ఈ హామీ నెరవేర్చలేదు. పంచడానికి భూముల్లేవ్. తెలంగాణలో రేట్లు కూడా బాగా పెరిగాయని కారణం చెప్పి ఈ స్కీమ్ కు మంగళం పాడేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కవిత కూడా ఇదే తరహా హామీని వినిపిస్తున్నారు. భూమి లేని పేద కుటుంబాలను గుర్తించి.. ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వడమే భూ లక్ష్మి లక్ష్యమని కవిత చెబుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని, అన్యాక్రాంతమైన భూములను సేకరించి పంపిణీ చేస్తామని ప్రకటించారు.
అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ఎంత భూమి అందుబాటులో ఉంది? ఎంతమంది భూమిలేని కుటుంబాలు ఉన్నాయి? భూమి లేదని ఈ పథకం జోలికి వెళ్ల లేని పరిస్థితుల్లో కవిత ఇచ్చిన హామీ వ్యూహంలో భాగమేనా అన్న చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల హామీ వచ్చే రోజుల్లో గట్టిగా పని చేస్తుందని అనుకుంటున్నారా? చేపలు పెట్టడం కాదు.. చేపలు పట్టడం నేర్పాలి అన్న సామెతను పాటించేదెవరు?
Also Read: ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్, కరెంట్ షాక్.. అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం!