Dimagi Naxals: కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేసిందో గుర్తింది కదా.. ఏకంగా ధర్మేంద్ర ప్రదాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయించేలా చేసింది. ఇప్పుడు దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఇది కూడా ఆన్ లైనే. ఇది మోడీ చేసిన కామెంట్స్ తో పుట్టుకొచ్చింది.
మావోయిస్టు హింస దాదాపు అంతమైందంటున్న కేంద్రం.. ఇప్పుడు ఆ ఐడియాలజీకి మద్దతిచ్చే మేధావులు, భావజాలాన్ని ప్రోత్సహించే వర్గాలపై నజర్ పెట్టింది. దిమాగీ నక్సల్స్ను గుర్తించి, ఒంటరిని చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ చుట్టూ పెద్ద దుమారమే నడుస్తోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం గతంలో మావోయిస్టులను తీవ్ర అంతర్గత భద్రతా ముప్పు అంటూ మన్మోహన్ సింగ్ చెప్పిన కామెంట్స్ ను గుర్తుచేస్తూ కాంగ్రెస్పై ఎదురుదాడి చేశారు.
Also Read: ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్, కరెంట్ షాక్.. అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం!
అర్బన్ నక్సల్స్ అన్న పదం చుట్టూ గతంలోనూ పెద్ద ఎత్తున చర్చ, దుమారం రెండూ నడిచాయ్. ఇప్పుడు దిమాగీ నక్సల్స్ మ్యాటర్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. నక్సలిజం పేరుతో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారా? విమర్శించేవాళ్లందరినీ దిమాగీ నక్సల్స్గా ముద్ర వేస్తున్నారా అన్న ప్రశ్నల్ని విపక్షాలు వినిపిస్తున్నాయ్.
Also Read: ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?