Death Penalty: ప్రస్తుతం మనదేశంలో మరణశిక్ష అమలుకు ఉరిశిక్షే చట్టబద్ధమైన విధానం. కానీ ఇది కరెక్ట్ కాదంటూ న్యాయవాది రిషి మల్హోత్రా సవాల్ చేశారు. ఉరి క్రూరమైన శిక్ష అని, ఈ బాధ అనుభవించే ఖైదీ హక్కుల చుట్టూ కొత్త చర్చకు తెరలేపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించే జీవించే హక్కుతో పాటు గౌరవప్రదమైన ప్రక్రియను పరిగణనలోకి తీసుకోవాలన్న వాదనపై సుప్రీంలో కీలక వాదోపవాదాలు నడిచాయ్.
Also Read: ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!
ఉరిశిక్షకు ఆల్టర్నేట్ గా విషపూరిత ఇంజెక్షన్తో పాటు షూటింగ్, కరెంట్ షాక్, గ్యాస్ ఛాంబర్ వంటి పద్ధతులను కూడా పిటిషన్లో ప్రస్తావించారు. అయితే ఏ విధానంలో నిజంగా తక్కువ బాధ ఉంటుందన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్. కేంద్రం కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై అత్యున్నత స్థాయిలో పరిశీలన జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలిపింది. చాలా పెద్ద తప్పు చేసిన వారికే అది కూడా అరుదుగా మరణ శిక్షలు విధిస్తుంటాయి కోర్టులు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. మరణ శిక్ష అమలులోనూ తక్కువ బాధ ఉండేలా చూడాలన్న వాదన కరెక్టేనా?
Also Read: డీఎస్సీ ఇష్యూను వదిలే ప్రసక్తే లేదు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్!