Minister Allegations: పేరు చెప్పలేదు కానీ.. ఆయన ఖద్దరు చొక్కా వేసుకున్న కామాంధుడని బాంబు పేల్చింది ఓ ఎన్నారై మహిళ. అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే డేట్కి రమ్మన్నాడట. అఫీషియల్గా వెళ్లి కలిస్తే సీక్రెట్గా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందామని అన్నాడట. ఈ ఆరోపణలు ఈ గల్లీ లీడర్ పైనో మామూలు వ్యక్తి పైనో కాదు ఏకంగా ఏపీ క్యాబినెట్ మినిస్టర్పైనే చేసింది.
అమెరికా డల్లాస్లో జరిగిన నాటా ఈవెంట్కు వచ్చిన ఆ మంత్రిని పిల్లల చదువుల కోసం పనిచేసే PURE అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ శైలా తల్లూరి మీట్ అయ్యారు. ఆ సమయంలో తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ఆమె వాదన. ఆ మంత్రి రాక్షసానందం అంతటితో ఆగలేదని ఫోన్లలో అసభ్యకరమైన మెసేజ్లు, ఫోటోలు పంపించి ఇరిటేషన్ తెప్పించాడట. ఈ వ్యవహారంపై నేరుగా మంత్రి నారా లోకేష్కు ఫేస్బుక్ ద్వారా కంప్లైంట్ చేశారామె. తన దగ్గర చాట్ హిస్టరీ, స్క్రీన్షాట్లు ఉన్నాయని వాటిని చూసైనా యాక్షన్ తీసుకోండని రిక్వెస్ట్ చేస్తోంది.
Also Read: 100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్పై అంబటి ఫైర్!
ఇక్కడ రెండు ప్రశ్నలు ఆమె చేసిన ఆరోపణలు నిజమా కాదా అనేది ఒక్కటైతే.. ఒకవేళ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలి? బాధితురాలి వాదనను వినాలా? లేక మౌనంగా ఉండాలా? గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలపైనా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా కేబినెట్ మంత్రిపైనే రావడంతో రాజకీయ దుమారం రేగుతోంది. మరి ఎన్నారై విమెన్ ఆవేదనను ప్రభుత్వం అలకిస్తుందా యాక్షన్ తీసుకుంటుందా?
Also Read: ఏపీ ప్రజల పదేళ్ల కన్నీళ్లకు ముగింపు లభిస్తుందా.. అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియపై అసలు నిజాలివే!