Employee Privacy: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ప్రైవసీకి సంబంధించి కొత్త విషయం చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ యూజర్ ఎక్స్పీరియన్స్ మానిటరింగ్ టూల్ ద్వారా ఉద్యోగులు ఏ అప్లికేషన్లు వాడుతున్నారు.. ఎంత సమయం గడుపుతున్నారు అన్న సమాచారం కనిపిస్తుందన్న ప్రచారం జోరందుకుంటోంది. దీనిపై టీసీఎస్ రియాక్టైంది. ఉద్యోగుల వ్యక్తిగత కార్యకలాపాలను తాము ట్రాక్ చేయడం లేదని, నెట్వర్క్ పనితీరు, సెక్యూరిటీ, యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుదల తమ ఉద్దేశమన్నది.
Also Read: ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..
సంస్థలకు చెందిన సిస్టమ్స్, పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి మానిటరింగ్ టూల్స్ వాడటం కొత్తేమీ కాదు. రహస్య సమాచారం బయటకు వెళ్లకుండా చూడటం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, సైబర్ భద్రతను పెంచడం.. ఇవే ప్రధాన ఉద్దేశాలు. టెక్ రంగంలో డిజిటల్ నిఘా ఇప్పటికే చర్చనీయాంశమే. మెటా అయితే ఉద్యోగుల కంప్యూటర్లలో కీబోర్డ్ స్ట్రోక్స్, మౌస్ కదలికలు, క్లిక్లను ట్రాక్ చేసే వ్యవస్థను తీసుకొచ్చిన వ్యవహారం కూడా గతంలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత విమర్శలు రావడంతో తాత్కాలికంగా ఆపేశారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రైవసీకి చోటు ఉందా? అంతే సంగతా?
Also read: ఇరుముడి కోసం ఒక్కటైన హీరోల ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే!