22A Land: 22-A చిక్కులకు బీజం ధరణి డేటాలోనే పడిందా? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ధరణి నుంచి భూ భారతి వరకు.. పోర్టల్ మారింది కానీ భూ రికార్డులపై ప్రశ్నలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 22-A నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు కూడా చేరిపోయాయన్న ఆందోళన అందర్నీ కలవరపెడుతోంది. ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ భూములను ఉద్దేశపూర్వకంగా 22-Aలో చేర్చలేదని చెబుతోంది. తవ్వుతూ పోతే భూముల డిజిటలైజేషన్ జరిగిన ధరణి టైంలోనే ఈ సమస్యకు బీజం పడిందా అన్న చర్చ జరుగుతోంది.
Also Read: జీవో 97 vs పాలిటెక్నిక్ స్టూడెంట్స్.. రంగంలోకి కేటీఆర్.. ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్!
నిజానికి ధరణి వచ్చాక రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కారణం ధరణే. దాన్ని ప్రైవేట్ సంస్థ మెయింటేన్ చేయడం, డిజిటలైజేషన్ లోపాలే ఇప్పుడు 22A సమస్యకు దారి తీశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. 22-A లిస్ట్లోకి వెళ్లిన భూములే కొత్త పంచాయితీగా మారాయ్. డేటా ఎంట్రీ, మ్యాపింగ్, పాత రికార్డుల డిజిటలైజేషన్లో జరిగిన పొరపాట్లకు ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలైతే వస్తున్నాయ్. ధరణి లోపాలకు ఫుడ్ ఆడిట్ ఎప్పుడు?