KTR: జీవో 97 కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతియుతంగా నిరసనను తెలుపుతున్న విద్యార్థుల మీద కొన్ని చోట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు తనను కలిచి వేశాయని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థుల హక్కులను కాలరాయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేస్తున్నట్లు తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో 97 ను వెనక్కి తీసుకోవాలని సూచించారు.
జీవో 97 కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను.
రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.
శాంతియుతంగా నిరసనను తెలుపుతున్న… pic.twitter.com/5n8m396NFR
— KTR (@KTRBRS) August 20, 2026
Also Read: నదీ జలాలపై ఏకపక్ష నిర్ణయాలొద్దు.. అన్ని రాష్ట్రాలకూ ఒకటే రూల్.. డిప్యూటీ సీఎం డిమాండ్
ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారన్నారు. ఇకముందు కూడా పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం జరిగేవరకూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారిలో భరోసాను నింపారు.
Also Read: పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా బయటకొస్తే ? తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు