Congress Rift: తెలంగాణ కాంగ్రెస్ ఏకతాటిపై వుందా? కలహాల మార్క్ను కంటిన్యూ అవుతోందా? కొత్తగా వచ్చినోళ్ల షో అప్ ఎక్కువైందన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఇటు గాంధీభవన్ అటు కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం సరికాదు. ఏదైనా వుంటే నేరుతా తనతో మాట్లాడాలే కానీ మీడియాకెక్కి పార్టీకి డ్యామేజ్ చేయోద్దని సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కొత్తనీరు వచ్చి పాతనీరును తొక్కేస్తుందనే రేంజ్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్కు ఓ రకంగా ఇది స్ట్రాంగ్ కౌంటర్. మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే రాజగోపాల్ రెడ్డి ఔట్ రైట్ బ్లో ఔట్ అవుతున్నారా? అనే టాక్ నడుస్తుండగానే.. కొత్త ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలు సన్సేషన్గా మారాయి. జెన్జీ గా తనకు కేబినెట్లో చోటివ్వలేదనే కోపమో ఏమో కానీ మండే అగ్నిపర్వతంలాండోడని రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేశారాయన.
Also read: ఆవులదే రాజ్యం.. మనుషులు సైలెంట్.. ఈ వింత దేశం గురించి తెలుసా?
లైన్ దాటొద్దని హైమాండ్ గైడ్లైన్స్ ప్రకారం వ్యవహారించాలని ఓవైపు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మరోవైపు ఏకంగా సీఎం రేవంత్ స్ట్రాంగ్ గా చెప్పినా ఒకరెనక ఒకరు ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కతేంటి? ఇది టీకప్పులో తుఫానా? లేదంటే రాబోయే ముసలానికిసంకేతమా? స్వపక్షంలో విపక్ష కోరస్ వెనుక రాజకీయం ఏంటన్నది కాంగ్రెస్లోనే కాదు పొలిటికల్ డొమైన్లో చర్చగా మారిందిప్పుడు.
Also read: మేడ్చల్ పీహెచ్సీలో దారుణం.. ప్రసవం కోసం వస్తే గాంధీ ఆస్పత్రికి రిఫర్..!