Graduate MLC: ఓ వైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. గెలుపు గుర్రాలు ఎవరని ప్రధాన పార్టీలు స్కానింగ్ ప్రాసెస్ చేపట్టాయి. ఉనికి చాటుకోవడానికి ఊతం దొరికినట్టుగా కవిత టీఆర్ఎస్ పార్టీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.
ఇప్పటికే జనంబాటపట్టిన కవిత తన సొంత జిల్లా నిజామాబాద్లో ఈ నెల 31న భారీ సభ పెట్టాలని నిర్ణయించారు. ఇక సమరశంఖమే అనేలా సభకు పాంచజన్య సంకల్ప సభ అనే పేరు కూడా పెట్టారు. ఆ సభా వేదికగా తెలంగాణ రక్షణ సేన నిర్దేశించుకున్న ఐదు ప్రధాన లక్ష్యాలతో పాటు పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను కవిత వివరిస్తారని తెలుస్తోంది.
Also Read: శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!
సభాఏర్పాట్ల బాధ్యతను కోరుట్లకు చెందిన డాక్టర్ రఘుకు అప్పగించారు. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్ల భారీగా జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. సభను సక్సెస్ చేయడం ద్వారా పల్లె పల్లెకు తమ వాయిస్ విన్పించాలన్నది టీఆర్ఎస్ వ్యూహం. ఇదంతా ఒకవైపు. రెండో వైపు మరోచర్చజరుగుతోంది. జెండా,అజెండా సరే అసలు లీడర్లు ఏరి? క్యాడర్ ఏరి? ఎలాంటి చేరికలు లేకుండా కవిత ప్లాన్ వర్కవుటవుతుందా? ఇప్పటికైతా ఆన్సర్ వెయిట్ అండ్ సీ..
Also read: ప్రశాంతంగా ఉందని ఈ ఊరికి వచ్చాడు… లోపల గుట్టు తెలిస్తే షాకే భయ్యా