E-Paper
Advertisement

ముగిసిన SIR ప్రక్రియ..మా ఓటు సేఫెనా?

ముగిసిన SIR ప్రక్రియ..మా ఓటు సేఫెనా?
Advertisement

Telangana SIR: తెలంగాణలో సర్ ప్రక్రియ.. ఆశలతో మొదలై అనుమానాలతో ముగిసినట్టే కనిపిస్తోంది. గడువులు పెట్టారు. టార్గెట్లు నిర్ణయించారు. కానీ అమలు దశలో మాత్రం అడ్డంకులు తప్పలేదు. చివరి రోజు నాటికి లక్ష్యాలు పూర్తయ్యాయా లేదా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. కొన్నిచోట్ల మంచి స్పందన కనిపించినా… మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యాలు, సాంకేతిక సమస్యలు వెంటడాయి.

74 లక్షల పత్రాలు పెండింగ్‌

Advertisement

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 78 శాతానికి పైగా డిజిటైజేషన్ పూర్తయిందని గణంకాలు చెబుతున్నాయి. ఇంకా 74 లక్షల పత్రాలు పెండింగ్‌లో ఉండటం… ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగియలేదన్న సందేహాలను మరింత పెంచుతోంది. ఫారాలు పూర్తి చేసి ఇచ్చినా డిజిటల్ ఎంట్రీ కాలేదని కొందరు.. అసలు ఫారాలే అందలేదని మరికొందరు తలలు పట్టుకుంటున్నారు.

Also Read: జంతర్ మంతర్ సీన్స్.. రాంచీలో రిపీట్

Advertisement

బీఎల్‌వోలకు చుక్కలు కనిపించాయి..

గ్రామీణ ప్రాంతాల్లో ప్రక్రియ వేగంగా సాగినప్పటికీ.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. డోర్ నంబర్లు దొరక్కపోవడం, అపార్ట్‌మెంట్లలోకి అనుమతులు లేకపోవడం, ఐటీ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో బీఎల్‌వోలకు చుక్కలు కనిపించాయి. ఇక గడువు ముగిసిపోయింది.. పొడిగించే ప్రసక్తి లేదని అధికారులు తేల్చేయడంతో.. ఫారం సమర్పించని లక్షలాది మంది ఓటర్ల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. డెడ్‌లైన్ పేరు చెప్పి సాంకేతిక కారణాలతో ఏ ఒక్క పౌరుడి ఓటూ గాల్లో కలసిపోకూడదనే డిమాండ్ వినిపిస్తోంది.

Tags

Related News

ఇన్‌ఫ్లూయెన్సర్లకు షాక్..ప్రమోషన్లకు ఆంక్షలు?

హద్దు దాటిన నోరు.. కటకటాల వెనక్కి మోహన్‌దాస్!

ప్రియాంక కుటుంబానికి తక్షణ న్యాయం ఎప్పుడు?

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై క్రెడిట్ వార్..!

మోడీ పొర‌పాటు.. ఆర్ఎస్ఎస్ దిద్దుబాటు! జెన్‌జీని మ‌చ్చిక చేసుకునే ప‌నిలో బీజేపీ.. పీచేముడ్‌!

నిను వీడ‌ని బొద్దింక‌లు మేమే! చీఫ్ జ‌స్టిస్ చీఫ్ గెస్ట్‌గా మాకొద్దు.. న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల లేఖ దుమారం!

నాగార్జునసాగర్‌లో వరుణ యాగానికి సర్వం సిద్దం..!

Big Stories

Advertisement
×