Tummidihetti Barrage: ఇన్నాళ్లూ గొడవపడ్డ వాళ్లే సంధికొచ్చారు పగలు, ప్రతీకారాలు పక్కనపెట్టి కూర్చొని మాట్లాడుకుందామని దారికొచ్చారు. కానీ పంచాయితీ చేసే పెద్దమనిషికి మాత్రం మూడ్ లేదట. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో జరుగుతున్న పచ్చి నిజం. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఏళ్లకు ఏళ్లుగా నలుగుతున్న జల వివాదాన్ని సామరస్యంగా తేల్చుకుంటామని రెండు రాష్ట్రాలు సిద్ధపడినా ఢిల్లీలోని కేంద్ర పెద్దలు మాత్రం మౌనమే సమాధానమంటున్నారు.
ఉత్తర తెలంగాణ దాహార్తిని తీర్చే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు మా ప్రాంతానికి ప్రాణవాయువు అని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ పీఠం మెట్లు ఎక్కుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ముందర చేతులు జోడించి విన్నవిస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలతో ఒకే ఒక్క సమావేశం పెట్టించండి సమస్యను సామరస్యంగా పరిష్కరించి అనుమతులు ఇప్పించండని కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
Also Read: ఏపీ ప్రజల పదేళ్ల కన్నీళ్లకు ముగింపు లభిస్తుందా.. అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియపై అసలు నిజాలివే!
వినతిపత్రాలు ఇవ్వడానికి వెళ్తే ఫోటోలకు ఫోజులివ్వడం, చిరునవ్వులు చిందించడం తప్ప ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకేయడం లేదు కేంద్రమంత్రులు! పంచాయితీ తెంచాల్సిన పెద్దమనుషులే ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య సమావేశం పెట్టడానికి ముఖం చాటేస్తున్నారు. రైతుల కళ్లల్లో ఆశలు నింపే ప్రాజెక్టుపై రాజకీయం చేయడం తగునా? వినతిపత్రాలు అందుకోవడానికి ఉన్న ఆసక్తి. రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించడానికి ఎందుకు రావడం లేదు.
Also Read: తెలంగాణ బీజేపీలో బండి వర్సెస్ ఈటల.. నకిలీ నవ్వులేనా.. లోపల పాత పగలున్నాయా..!