Boat accident: వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హలోంగ్ బేలోని భారీ పడవ బోల్తా పడడంతో 28మంది మృతిచెందారు. పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ పడవలో మొత్తం 53 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే పడవ ప్రయాణం మధ్యలో ఉండగా భారీగా ఈదురు గాలులు వ్యాపించాయి. ఉరుములు సంభవించాయి. ఈ క్రమంలోనే పడవ అదుపు తప్పడంతో బోల్తా పడింది.
దీంతో వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 12 మంది టూరిస్టులను రక్షించగా.. మిగిలినవారు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై వియత్నాం పీఎం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గల్లంతైన వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టాలని సహాయక బృందాలకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్
ALSO READ: Aghori-Varshini: జైలులో అఘోరీ.. పబ్లో వర్షిణి.. వీడియో వైరల్