E-Paper
Advertisement

Hyderabad News: పాఠశాల పైనుంచి దూకిన విద్యార్థి మృతి.. అసలేం జరిగింది?

Hyderabad News: పాఠశాల పైనుంచి దూకిన విద్యార్థి మృతి.. అసలేం జరిగింది?
Advertisement

Hyderabad News: హైదరాబాద్ మియాపూర్ ఓ పాఠశాలలో దారుణం జరిగింది. ఓ స్కూల్ బిల్డింగ్‌పై నుంచి కిందపడి విద్యార్థి మృతి చెందాడు. మృతుడు పదో తరగతి చదువుతున్నాయి. స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడు. విద్యార్థి కుటుంబసభ్యులకు తెలియగానే షాకయ్యారు.

మియాపూర్‌లోని మధురానగర్ ఏరియాలో సెయింట్ మార్టిన్ పాఠశాల ఉంది. అందులో పదో తరగతి చదువుతున్నాడు షేక్ రిజ్వాన్. సమయం, సందర్భం ఇంకా తెలీదు. కాకపోతే పాఠశాల భవనం ఐదో అంతస్తుకు వెళ్లిన రిజ్వాన్, అక్కడి నుంచి కిందకు దూకాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో సమీపంలో హాస్పటల్‌కి పాఠశాల సిబ్బంది తరలించారు.

Advertisement

అదే సమయంలో విద్యార్థి పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. కొడుకు మృతితో రిజ్వాన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు.

విద్యార్థులతో గొడవపడి కిందకు పడ్డాడా? లేకపోతే పందెం కాసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడా? కావాలనే ఎవరైనా భవనం పైనుంచి కిందకు తోసివేశారా? అనేది తెలియాల్సివుంది. పాఠశాలలో సీసీటీవీ పుటేజ్‌ని పరిశీలించారు. రిజ్వాన్ చదువుతున్న క్లాస్‌లో కొందర్ని పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

Advertisement

ALSO READ: దారుణం పడవ బోల్తాపడి 28 మంది మృతి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×