E-Paper
Advertisement

Guntur suicide case: భార్యపై అనుమానం? భర్త సూసైడ్.. ఏపీలో ఘటన!

Guntur suicide case: భార్యపై అనుమానం? భర్త సూసైడ్.. ఏపీలో ఘటన!
Advertisement

Guntur suicide case: ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యల ఖాతాలోకి మరో ఘటన చేరింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి లో బుధవారం వెలుగులోకి వచ్చింది. అయితే వివాహేతర సంబంధం కారణంగా సెల్ఫీ సూసైడ్ జరిగినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుంటూరు జిల్లా తాడేపల్లి కి చెందిన బ్రహ్మయ్యకు ఏడాది క్రితం కౌసల్యతో వివాహం జరిగింది. అయితే పెళ్లిచూపుల సమయంలోనే మూడో రోజే బ్రహ్మయ్య తండ్రి అకస్మాత్తుగా కన్నుమూశారు. దీనితో కౌసల్యతో వివాహం వద్దని పెద్దలు వారించినా, బ్రహ్మయ్య ససేమిరా అంటూ ఆమెను వివాహం చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత వారి దాంపత్య జీవితం ఆనందదాయకంగా సాగుతూ వచ్చింది.

Advertisement

Also Read: Shivamogga bridge: కాస్త టైమ్ ఉందా? ఈ కేబుల్ బ్రిడ్జిపై జర్నీ ప్లాన్ చేసేయండి!

అయితే ఊహించని రీతిలో కొన్ని నెలల నుండి తరచూ.. ఘర్షణలు చోటుచేసుకుంటున్న వాతావరణం, ఆ కుటుంబంలో నెలకొంది. భార్యాభర్తల మధ్య విభేదాలు అధికం కాగా, తరచూ గొడవలు జరిగేవి. కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుంటూ ఇద్దరికీ సర్ది చెప్పేవారు. ఈ తరుణంలోనే బ్రహ్మయ్య హఠాత్తుగా సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు.

Advertisement

తన చావుకు గల కారణాలు తెలిపి, బ్రహ్మయ్య సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, కౌసల్యకు వివాహేతర సంబంధం ఉండడంతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు బ్రహ్మయ్య తల్లి ఆరోపించారు. మొత్తం మీద తాడేపల్లిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుత సంచలనంగా మారింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×