E-Paper
Advertisement

Guntur suicide case: భార్యపై అనుమానం? భర్త సూసైడ్.. ఏపీలో ఘటన!

Guntur suicide case: భార్యపై అనుమానం? భర్త సూసైడ్.. ఏపీలో ఘటన!

Guntur suicide case: ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యల ఖాతాలోకి మరో ఘటన చేరింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి లో బుధవారం వెలుగులోకి వచ్చింది. అయితే వివాహేతర సంబంధం కారణంగా సెల్ఫీ సూసైడ్ జరిగినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుంటూరు జిల్లా తాడేపల్లి కి చెందిన బ్రహ్మయ్యకు ఏడాది క్రితం కౌసల్యతో వివాహం జరిగింది. అయితే పెళ్లిచూపుల సమయంలోనే మూడో రోజే బ్రహ్మయ్య తండ్రి అకస్మాత్తుగా కన్నుమూశారు. దీనితో కౌసల్యతో వివాహం వద్దని పెద్దలు వారించినా, బ్రహ్మయ్య ససేమిరా అంటూ ఆమెను వివాహం చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత వారి దాంపత్య జీవితం ఆనందదాయకంగా సాగుతూ వచ్చింది.

Also Read: Shivamogga bridge: కాస్త టైమ్ ఉందా? ఈ కేబుల్ బ్రిడ్జిపై జర్నీ ప్లాన్ చేసేయండి!

అయితే ఊహించని రీతిలో కొన్ని నెలల నుండి తరచూ.. ఘర్షణలు చోటుచేసుకుంటున్న వాతావరణం, ఆ కుటుంబంలో నెలకొంది. భార్యాభర్తల మధ్య విభేదాలు అధికం కాగా, తరచూ గొడవలు జరిగేవి. కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుంటూ ఇద్దరికీ సర్ది చెప్పేవారు. ఈ తరుణంలోనే బ్రహ్మయ్య హఠాత్తుగా సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు.

తన చావుకు గల కారణాలు తెలిపి, బ్రహ్మయ్య సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, కౌసల్యకు వివాహేతర సంబంధం ఉండడంతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు బ్రహ్మయ్య తల్లి ఆరోపించారు. మొత్తం మీద తాడేపల్లిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుత సంచలనంగా మారింది.

Related News

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

Big Stories

×