E-Paper
Advertisement

Crime News: భార్యను దారుణంగా నరికి.. తలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భర్త

Crime News: భార్యను దారుణంగా నరికి.. తలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భర్త
Advertisement

Crime News: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆనేకల్‌ ప్రాంతంలో జరిగిన ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. శంకర్ (28), మానస (26) ఇద్దరూ భార్యభర్తలు. అయితే శంకర్, తన భార్య మానస (26) వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో దారుణంగా ఆమె తలను నరికి.. సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి హీలలిగే గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. శంకర్, మానస దంపతులు కొంతకాలం నుంచి హీలలిగే గ్రామంలో ఓ ఇంట్లో రెంట్‌కు ఉంటున్నారు. జూన్ 3న శంకర్ పని నిమిత్తం బయటకు వెళ్తానని చెప్పి.. అనుకోకుండా అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో మానస మరో వ్యక్తితో ఉన్నట్లు శంకర్ ఆరోపిస్తున్నాడు. దీంతో శంకర్ ఆమెపై తీవ్ర అనుమానాన్ని పెంచుకున్నాడు. గత వారం నుంచి ఈ అనుమానంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఇదే వివాదంపై మళ్లీ ఇద్దరు గొడవకు దిగారు.

Advertisement

ALSO READ: Life After Death : 24 నిమిషాల పాటు చనిపోయిన మహిళ.. ఆ సమయంలో ఆమె ఏం చూసిందంటే..

కోపంతో రెచ్చిపోయిన శంకర్ సమీపంలోని దుకాణం నుంచి కత్తిని కొని.. మానసపై కిరాతకంగా దాడి చేశాడు.  ఆమె తలను నరికాడు. అనంతరం, ఆమె తలను స్కూటర్‌పై తీసుకుని సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు వెంటనే శంకర్‌ను అదుపులోకి తీసుకుని, ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.

Advertisement

ALSO READ: Breaking News: గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు..

ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. వివాహేతర సంబంధాలపై అనుమానాలు.. ఇలాంటి దారుణాలకు దారితీయడం సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి, శంకర్‌పై హత్య నేరం కింద చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×