Annamaya District: ఏపీలో దారుణ విషాదం చోటుచేసుకుంది. రాజంపేట మండలంలో బాలరాజుపల్లి, చెయ్యేరులో ఈతకు వెళ్లి ముగ్గురు మృతిచెందగా.. ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులని పోలీసులు తెలిపారు. మృతుల పేర్లు దిలీప్, చంద్రశేఖర్, కేశవగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నిన్న కర్నూలు జిల్లాలో నీటికుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతిచెందని విషయం తెలిసిందే. ఆ విషాద ఘటన మరవకు ముందే ఈ రోజు మరో ముగ్గురు యువకులు మృతిచెందగా.. ఓ వ్యక్తి గల్లంతయ్యారు.
ALSO READ: Jonnagiri: అదృష్టమంటే ఈమెది.. రూ.300 కూలికి పోతే.. రూ.40లక్షల వజ్రం దొరికింది..!