BigTV English

Annamaya District: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు

Annamaya District: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు

Annamaya District: ఏపీలో దారుణ విషాదం చోటుచేసుకుంది. రాజంపేట మండలంలో బాలరాజుపల్లి, చెయ్యేరులో ఈతకు వెళ్లి ముగ్గురు మృతిచెందగా.. ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులని పోలీసులు తెలిపారు.


మృతుల పేర్లు దిలీప్, చంద్రశేఖర్, కేశవగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నిన్న కర్నూలు జిల్లాలో నీటికుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతిచెందని విషయం తెలిసిందే. ఆ విషాద ఘటన మరవకు ముందే ఈ రోజు మరో ముగ్గురు యువకులు మృతిచెందగా.. ఓ వ్యక్తి గల్లంతయ్యారు.

నిన్న కర్నూల్ జిల్లా చిగిలి గ్రామంలోని నీటికుంటలో ఆరుగురు ఐదో తరగతి విద్యార్థులు ఈత కొట్టేందుకు వెళ్లి ఊపిరాడక మృతిచెందారు. అయితే పిల్లలు అందరూ ఒకేసారి కుంటలోకి దిగారు. ఆ నీటకుంట లోతు తెలియక పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే  రక్షంచే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. ఐదో తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ పిల్లలకు ఈత రాకపోవడం వల్లే మృతిచెందినట్టు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో ఆరుగురు చిన్నారులు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.


ALSO READ: Jonnagiri: అదృష్టమంటే ఈమెది.. రూ.300 కూలికి పోతే.. రూ.40లక్షల వజ్రం దొరికింది..!

 

Related News

AP Fake Liquor Racket: మూడు పాపులర్ బ్రాండ్ల నకిలీ మద్యం.. 14 మంది నిందితులు: బిగ్ టీవీతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్

Gandikota Murder Case: గండికోట రహస్యం.. చంపింది వాళ్లే! పాలిగ్రాఫ్‌ టెస్ట్‌లో బిగ్‌ ట్విస్ట్‌

Rabies: తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న కుక్కలు.. రేబిస్ వ్యాధితో మరో బాలుడు మృతి

Trap House Party: బాగా ముదిరిపోయారు.. ఫాంహౌస్‌లో మైనర్ల ట్రాప్‌హౌస్ పార్టీ..?

Vijayawada Crime: విజయవాడ మహిళ హత్య కేసు.. నిందితుడు అక్క కొడుకే, అసలు కారణం అదే?

Hyderabad News: బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. నార్సింగ్‌లో ఘటన, షాకింగ్ ఫుటేజ్

Moinabad News: మొయినాబాద్‌లో ‘ట్రాప్‌ హౌస్‌ పార్టీ.. ఇన్‌స్టాలో పరిచయం, బుక్కైన 50 మంది మైనర్లు

Visakha Beach: అలలు తాకిడికి కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు.. ఒకరు మృతి, విశాఖలో ఘటన

Big Stories

×