E-Paper
Advertisement

WhatsApp cyberfraud Hyderabad : రూ.2 కోట్లు కంపెనీ నిధులు దోపిడీ.. వాట్సాప్ మెసేజ్‌తో ఈజీగా దోచుకున్న ఫ్రాడ్!

WhatsApp cyberfraud Hyderabad : రూ.2 కోట్లు కంపెనీ నిధులు దోపిడీ.. వాట్సాప్ మెసేజ్‌తో ఈజీగా దోచుకున్న ఫ్రాడ్!

WhatsApp cyberfraud Hyderabad firm | సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆర్థిక మోసాలకు పాల్పడే నేరగాళ్లు ఊహకందని రీతిలో భారీ దొంగతనాలు చేస్తున్నారు. ఏకంగా కోట్ల రూపాయలు ఈజీగా దోచుకుంటున్నారు. తాజాగా ఒక కంపెనీ నిధుల నుంచి ఒక దొంగ ఈజీగా రూ.2 కోట్లు కాజేశాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేసే ఒక అకౌంట్స్ ఆఫీసర్ కి ఇటీవల వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ పంపిన వ్యక్తి మరెవరో కాదు కంపెనీ ఓనర్. ఆ మెసేజ్ వచ్చిన అకౌంట్ లో ఓనర్ ప్రొఫైల్ పిక్ కూడా ఉంది. ఆ మెసేజ్ లో రూ.1.95 కోట్లు కంపెనీ నిధులు మరొక అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయండి అని రాసి ఉంది. ఎందుకు చేయాలో కూడా కారణం సబబుగానే రాసి ఉంది. ఇదంతా చూసిన ఆ అకౌంట్స్ ఆఫీసర్ యథావిధిగా తాను చేసే పనిని చేసేశాడు. రూ.1.95 కోట్లు కంపెనీ డబ్బు ట్రాన్స్ ఫర్ చేసేశాడు. ఆ డబ్బులు ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ పేమెంట్ అని కారణంగా ఉండడంతో అతను అలా చేయడానికి సంకోచించలేదు.

Also Read: పెళ్లి సంబంధాల పేరుతో మోసాలు.. వీడియోలు అడ్డం పెట్టి, ఆపై

కానీ డబ్బులు పంపేశాక.. అదృష్టవశాత్తు కొంత సమయానికే అక్కడికి కంపెనీ ఎండీ అంటే యజమాని వచ్చారు. తన ఫోన్ కు కంపెనీ నిధులు మరో అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చిందని ఆరా తీశాడు. దీంతో ఆ అకౌంట్స్ ఆఫీసర్ తాను ఆ డబ్బులు తనే ట్రాన్స్ ఫర్ చేసేశానని చెప్పాడు. అతను చెప్పింది విని కంపెనీ యజమాని ఆశ్చర్యపోయాడు. తాను ఏ మెసేజ్ చేయలేదని తన కంపెనీ ఉద్యోగితో కోపంగా మాట్లాడాడు. దీంతో ఆ ఉద్యోగి వెంటనే తన ఫోన్ లో ఉన్న వాట్సాప్ మెసేజ్ చూపించాడు.

అది చూసిన కంపెనీ యజమాని అది తన నెంబర్ కాదని.. ఎవరో తన ఫొటోని వాట్సాప్ ప్రొఫైల్ పిక్ లో పెట్టి మోసపూరితంగా మెసేజ్ చేశారని చెప్పాడు. దీంతో ఖంగు తిన్న ఆ అకౌంట్స్ ఆఫీసర్ వెంటనే పోలీసులకు కాల్ చేయాలని సూచించాడు. వెంటనే కంపెనీ యజమాన్యం తెలంగాణ సైబర్ సెక్యూరిటీకి కాల్ చేయడంతో కొన్ని నిమిషాల్లోనే ఆ లావాదేవీని నిలుపుదల చేయగలిగారు. అది కోట్లలో లావాదేవి కావడంతో బ్యాంకు ప్రక్రియ పూర్తవడంలో సమయం పడుతుంది. ఈ గడువులో గానే పోలీసులు చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన కేసులో ఆ దొంగను ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. అతని బ్యాంక్ అకౌంట్ ట్రాక్ చేశామని విచారణ జరుగుతోందని తెలిపారు.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×