E-Paper
Advertisement

Yadadri Crime: హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. ప్రియుడితోపాటు, భువనగిరి జిల్లాలో దారుణం

Yadadri Crime: హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. ప్రియుడితోపాటు, భువనగిరి జిల్లాలో దారుణం
Advertisement

Yadadri Crime: రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తలను దారుణంగా చంపేస్తున్నారు భార్యలు. కేవలం వివాహేతర సంబంధం కోసం నిండు నూరేళ్లు బతకాల్సినవారి జీవితాలు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కోరుకున్న ప్రియుడి కోసం భర్తను సుఫారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది కట్టుకున్న భార్య.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. తొలుత రోడ్డు ప్రమాదంతో నమోదైన కేసు చివరకు ప్రేమ వ్యవహారమే కారణమని తేలింది. సోమవారం యాదాద్రి జిల్లా కాటేపల్లి పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. టూ వీలర్‌ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి స్పాట్‌లో మృత్యువాతపడ్డాడు.

Advertisement

మృతుడిని స్వామిగా గుర్తించారు పోలీసులు. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంగా భావించి కేసు నమోదు చేశారు. కారు నెంబరు ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. కావాలనే కారుతో బైక్‌ని ఢీ కొట్టి హత్య చేశారనే నిర్ఱారణకు వచ్చారు. దీంతో పోలీసుల అటెక్షన్ మొత్తం ఈ కేసుపైకి మళ్లింది.

దీనిపై లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. స్వామి హత్యకు ప్రధాన కారణం భార్య వివాహేతర సంబంధమని తేలింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య ప్లాన్ చేసినట్లు తేల్చారు. స్వామి భార్యని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విచారణలో కీలక విషయాలు బయటపెట్టింది ఆమె.

Advertisement

ALSO READ: స్కూల్ బాలికపై లైంగిక దాడి, యువకుడ్ని కొట్టి చంపేశారు

ఈ హత్యలో ఆమె తమ్ముడు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. హత్యకు కారణమైన ఇద్దరు సుపారీ కిల్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం కోసం పాకులాపడిన భార్య, భర్తను ఈ విధంగా చంపేయడంపై స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×