E-Paper
Advertisement

Bhagyashree: సీనియర్ నటికి గాయాలు, 13 కుట్లు.. ఇంతకీ ఏం జరిగిందంటే.?

Bhagyashree: సీనియర్ నటికి గాయాలు, 13 కుట్లు.. ఇంతకీ ఏం జరిగిందంటే.?
Advertisement

Bhagyashree: సీనియర్ నటి భాగ్యశ్రీ తాజాగా హాస్పిటల్‌లో బెడ్ మీద పడుకొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు తనకు ఏం జరిగిందని ఫ్యాన్స్ ఆందోళన పడడం మొదలుపెట్టారు. అసలు ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకే ఫ్యాన్స్‌కు రిలీఫ్ అందించడం కోసం నవ్వుతూ ఒక ఫోటోను షేర్ చేసింది భాగ్యశ్రీ. అప్పుడు కూడా తన తలకు గాయం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు విషయం ఏంటనేది తర్వాత బయటపడింది. పికిల్ బాల్ ఆడుతున్న సమయంలో తలకు గాయం అవ్వడం వల్ల భాగ్యశ్రీకు పలు సర్జరీలు జరిగాయని, 13 కుట్లు కూడా పడ్డాయని తెలుస్తోంది.

గేమ్‌లో గాయం

Advertisement

ఫారిన్ దేశాల్లో ఎప్పటినుండో పాపులర్ స్పోర్ట్స్‌గా ఉన్న పికిల్ బాల్ (Pickleball).. తాజాగా ఇండియాలో కూడా అడుగుపెట్టింది. ముఖ్యంగా సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఈ స్పోర్ట్స్‌ను ప్రమోట్ చేయడంతో వెంటనే దీనికి పాపులారిటీ లభించింది. అలా మరికొందరు సెలబ్రిటీలు కూడా పికిల్ బాల్ ఆడుతూ దీని గురించి ఇండియాలోని యూత్‌కు తెలిసేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా భాగ్యశ్రీ కూడా పికిల్ బాల్‌పై ఆసక్తితో గ్రౌండ్‌లో దిగారట. పికిల్ బాల్ ఆడుతున్న సమయంలో తన తలకు గాయం కావడంతో వెంటనే తనను ఆసుపత్రికి తరలించారట. తలకు గాయం చాలా బలంగా తగలడంతో ఆసుపత్రికి చేరుకోగానే భాగ్యశ్రీకి సర్జరీ చేశారట వైద్యులు.

ఫోటోలు వైరల్

Advertisement

పికిల్ బాల్ వల్ల జరిగిన గాయానికి భాగ్యశ్రీకి సర్జరీ జరగడంతో పాటు 13 కుట్లు కూడా పడ్డాయి. హాస్పిటల్ స్టాఫ్ ద్వారా భాగ్యశ్రీ (Bhagyashree) బెడ్‌పై పడుకొని ఉన్న ఫోటో బయటికొచ్చింది. కాసేపట్లోనే అది వైరల్ అయ్యింది. తనకు ఏమైందో తెలియకపోయినా తను వెంటనే కోలుకోవాలని తన ఫ్యాన్స్ కోరుకున్నారు. ఒక ఫోటోలో తను హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉండగా.. మరొక ఫోటోలో తనకు బ్యాండేజ్ ఉన్నా కూడా నవ్వుతూ కనిపించింది భాగ్యశ్రీ. దీంతో భాగ్యశ్రీ చాలా గట్టిదని, అంత గాయమయినా కూడా నవ్వుతూ ఉందని తన ఫ్యాన్స్ కాస్త రిలీఫ్ ఫీలవుతున్నారు. 13 కుట్లు పడడంతో తను పూర్తిగా కోలుకోవడానికి మరికాస్త సమయం పడుతుందని బాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.

Also Read: అయిదేళ్లలో హయెస్ట్ టీఆర్పీ.. పవన్ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’..

సినీ కెరీర్

1989లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. మొదటి సినిమానే సెన్సేషనల్ హిట్ కావడంతో భాగ్యశ్రీకి వెంటనే స్టార్‌డమ్ లభించింది. అలా కొన్నేళ్లలో పలు భారీ ప్రాజెక్ట్స్‌లో నటించింది. ఇక అప్పటి హీరోయిన్లలాగా భాగ్యశ్రీ కూడా పెళ్లి అవ్వగానే సినిమాలకు దూరమయ్యింది. చాలాకాలం తర్వాత 2021లో కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన ‘తలైవి’తో మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. ఆ తర్వాత ‘రాధే శ్యామ్’లో ప్రభాస్ తల్లిగా కనిపించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా స్పీడ్‌గా వెళ్లకుండా నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్‌ను నడిపిస్తోంది భాగ్యశ్రీ.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×