E-Paper
Advertisement

Samantha: నాగచైతన్యను జన్మలో కలవను.. ఏ ఈవెంట్ కు రాను ?

Samantha: నాగచైతన్యను జన్మలో కలవను.. ఏ ఈవెంట్ కు రాను ?
Advertisement

Samantha: స్టార్ హీరోయిన్ సమంత- అక్కినేని నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారు అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అదేంటి రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఈ జంట మళ్లీ ఎందుకు కలుస్తున్నారు..? నిజంగా ఇది జరుగుతుందా..? అని చాలామందికి అనుమానం వచ్చింది.  అయితే అసలు ఎందుకు వీళ్ళు కలుస్తున్నారు..? అనే విషయం గురించి మాట్లాడితే.. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. కొత్త సినిమాల కన్నా రీరిలీజ్ సినిమాలే ఎక్కువగా హైప్ తెచ్చుకుంటున్నాయి. దీంతో మేకర్స్ గతంలో బాగా హిట్ అయిన సినిమాలను రీరిలీజ్ చేస్తూ, వాటికి దగ్గరుండి ప్రమోషన్స్ చేయిస్తూ, మరింత హైప్  క్రియేట్ చేయిస్తూ, రికార్డు కలెక్షన్స్  రాబడుతున్నారు.

 

Advertisement

ఈ మధ్యనే అందాల రాక్షసి సినిమా రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు అందులో నటించిన  రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి ప్రమోషన్స్ కూడా చేసిన విషయం విదితమే. ఇక ఈ సినిమా తర్వాత మరో లవ్ స్టోరీ రీరిలీజ్ కు రెడీ అవుతుంది. అదే ఏ మాయ చేసావే. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా సెట్ లోనే చై- సామ్  పరిచయం.. ప్రణయంగా మారి పరిణయంకి దారితీసింది. ఆ తర్వాత ఈ జంట కలకాలం కలిసి ఉంటారని అభిమానులు ఎంతో ఆశించారు. కానీ, నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండా ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు.

 

Advertisement

విడాకుల అనంతరం ఎవరిదారి వారు చూసుకున్న  చైతన్య -సమంత ఇప్పటివరకు ముఖముఖాలు కూడా చూసుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఏ మాయ చేసావే రీరిలీజ్ ప్రమోషన్స్ లో కలవబోతున్నారని వార్తలు రావడంతో అభిమానులు ఆనందంతో గెంతులు వేశారు. జూలై 18న ఏ మాయ చేసావే  రీరిలీజ్ కానుంది. దీంతో ఈ మధ్యలోనే చై- సామ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై సమంత స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని చెప్పుకొచ్చింది.

Vijay-Rashmika: కారులో అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. కెమెరాలకు చిక్కకుండా ?

 

“ఏ మాయ చేసావే సినిమా టీమ్ తో కలిసి నేను ప్రమోషన్స్ చేస్తున్నాను అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడం లేదు. నిజం చెప్పాలంటే నేను ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాను. ఇలాంటి వార్తల ఎవరు కల్పిస్తున్నారో నాకు తెలియడం లేదు. అప్పుడు సినిమాలో నటించిన నటీనటులందరూ ఇప్పుడు మళ్లీ కలవాలని అభిమానులు కోరుకోవడంలో తప్పులేదు. తమ అభిమాన నటీనటులు మళ్లీ కలవాలని వారు అనుకోవచ్చు. కానీ,  ప్రేక్షకుల దృష్టి కోణం పై ఒకరి జీవితం ఆధారపడి ఉండదు “అని చెప్పుకొచ్చింది.

 

అయితే తాను నటించిన మొదటి సినిమా మాస్కోవేన్ కావేరి షూటింగ్ విషయాలు తనకేమీ గుర్తులేకపోయినా.. ఆ తరువాత  నటించిన ఏ మాయ చేసావే సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మర్చిపోలేనని అని చెప్పుకొచ్చింది. కార్తీక్ ఇంటి గేటు వద్ద జెస్సీ- కార్తీక్ మాట్లాడుకునేది తన మొదటి షాట్ అని తెలిపింది.  కెరీర్ ఆరంభంలోనే గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి డైరెక్టర్ తో కలిసి పని చేస అవకాశం రావడం తనకు ఎంతో సంతోషంగా అనిపించిందని సమంత తెలిపింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అదేంటి సమంత అంత మాట అనేసింది ఆమె ప్రమోషన్స్ కి వస్తుందని తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, ఇప్పుడు సామ్ రావడం లేదు అని చెప్పి మనస్సును ముక్కలు చేసిందని కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×