Road Accident: మలేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి ఓ మినీ వ్యాన్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మలేషియాలో యూనివర్సిటీ స్టూడెంట్స్ ను క్యాంపస్ కు తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర మలేషియాలోని సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీకి చెందిన బస్సు స్టూడెంట్స్ తో వెళ్తుండగా.. బస్సు అదుపు తప్పి మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే 15 మంది చనిపోయారు. గాయపడిన 30 మందిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫుప సహాయం చేయాలని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ: Covid Cases : 65 మంది మృతి.. 6 వేల కేసులు.. కరోనా కల్లోలం ఆగేదేలే!
సంఘటనా స్థలం దగ్గరకు వెళ్లిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Train Accident: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి.. ఐదుగురు మృతి