E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఐరోపాలో కరిగిపోతున్న రోడ్లు.. 1000 మంది పైగా మృతి

ఐరోపాలో కరిగిపోతున్న రోడ్లు.. 1000 మంది పైగా మృతి
Advertisement

Europe Heatwave: గాడ్జిల్లా ఎల్ నినో ప్రభావం యూరప్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ ఖండంలోని సగానికి పైగా దేశాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇంట్లో ఉక్కపోతకు తట్టుకోలేక పార్కులు, స్విమ్మింగ్ ఫూల్స్‌ని వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. ఎండ వేడికి తట్టుకోలేక ఒక్క ఫ్రాన్స్‌లో దాదాపు 1000 మంది మృతి చెందారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న యూరప్

Advertisement

వేడిగాలులతో ఐరోపా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దశాబ్దాల నాటి ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలవుతున్నాయి. తీవ్రమైన వేడి కారణంగా దాదాపు 1,000 మంది ఫ్రాన్స్‌లో మృతి చెందినట్టు అక్కడి మీడియా చెబుతోంది. ఈ మరణాలు కేవలం మూడు రోజుల్లో చోటు చేసుకున్నాయి. జూన్ 24- 27 మధ్య జరిగింది. ఇక పారిస్ గురించి చెప్పనక్కర్లేదు. పరిసర ప్రాంతాల మృతుల్లో వృద్ధులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జర్మనీ, స్పెయిన్, బ్రిటన్, డెన్మార్క్, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాల గురించి చెప్పనక్కర్లేదు. ఎండవేడిమి తాళలేక పార్కులు, పాడ్ల మధ్య సేదతీరుతున్నారు. ఎప్పుడూ చల్లగా ఉండే యూరప్‌లో ఈ స్థాయిలో ఎండలు నమోదు కావడంతో అక్కడి ప్రజలకు అంతుబట్టడం లేదు. ఇంకా ఎన్నాళ్లు ఈ బాధలంటూ చర్చించుకోవడం మొదలైంది.

Advertisement

ఫ్రాన్స్‌లో వెయ్యి మంది మృతి, కరిగిపోతున్న రోడ్లు, రైలు పట్టాలకు తప్పని ఇబ్బందులు

యూరప్‌ అంతటా దాదాపు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఫలితంగా ఫ్రాన్స్‌లోని రోడ్లు కరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. గాడ్జిల్లా ఎల్ నినోతోడు అనేక ప్రాంతాలల కార్చిచ్చు కూడా ఈ తీవ్రతు కారణంగా చెబుతున్నారు అధికారులు. ప్రపంచ సగటు కంటే యూరప్‌లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయన్నది శాస్త్రవేత్తల మాట.

ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బ్రిటన్ చరిత్రలో తొలిసారి. మూడురోజుల పాటు రెడ్ వార్నింగ్ హెచ్చరికలు జారీ చేశారు అక్కడి అధికారులు. బ్రిటన్‌ వ్యాప్తంగా 1000 కి పైగా పాఠశాలలు మూతబడ్డాయి. ఉష్ణోగ్రతల కారణంగా చివరకు ఇనుప రైలు పట్టాలు వంగిపోయే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

ALSO READ: చైనాలో భూకంపం.. వణికిన సిచువాన్ ప్రావిన్స్‌, ప్రాణ, ఆస్తి నష్టానికి 

జర్మనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా రైళ్లపై వేగాన్ని గంటకు 60 మైళ్లకు తగ్గించాల్సి వస్తోందని చెబుతున్నారు అధికారులు. ట్రామ్ ట్రాక్‌లు వంగిపోవడంతో రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ గ్రిడ్‌లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అటు బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిపోయాయి.

ప్రతిరోజూ నమోదయ్యే సాధారణ మరణాలకు ఇవి అదనమని ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. తూర్పు ప్రాంతమైన కూబ్‌షూట్స్‌లో రికార్డు స్థాయిలో రాత్రి వేళ 29.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మోకెర్న్‌ డ్రీవిజ్‌లో 41.5 డిగ్రీల సెల్సియస్‌ పగటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Related News

China Earthquake: చైనాలో భారీ భూకంపం.. వణికిన సిచువాన్ ప్రావిన్స్‌, ప్రాణ-ఆస్తి నష్టానికి

కువైట్-బహ్రెయిన్‌లపై ఇరాన్ భీకరదాడులు.. నరకం చూస్తారంటూ అమెరికాకు హెచ్చరిక

క్షణాల్లో స్మశానంలా మారిన వెనిజులా.. ఈ వీడియోలు చూస్తే హడలిపోతారు!

రెండు భారీ భూకంపాలు.. చిగురుటాకులా వణికిన వెనిజులా, కూలిన ఎత్తైన భవనాలు, మృతులు లక్ష వరకు..

నిప్పులకుంపటిలా ఆకాశం.. ఫ్రాన్స్‌ను చుట్టేసిన ‘ఓమేగా బ్లాక్’.. 40 మంది మృతి

అన్నికోణాల్లో ట్రంప్ సర్కార్.. అమెరికా పౌరసత్వం ఇక ఖరీదే, భారీగా ఫీజు పెంపు!

భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్.. ఇక అమెరికాలో చదువు అంత ఈజీ కాదు..!

Big Stories

×