E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. స్పాట్‌లో 40 మంది మృతి!

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. స్పాట్‌లో 40 మంది మృతి!
Advertisement

Bus Accident: దారుణం.. పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న ఒక బస్సు నియంత్రణ కోల్పోయి పర్వత ప్రాంతం నుంచి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. బలూచిస్థాన్‌లోని షేరానీ జిల్లా ధనాసర్ ప్రాంతం మీదుగా ఖైబర్ పఖ్తుంఖ్వా వైపు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా నుంచి పెషావర్ నగరానికి బయలుదేరిన ఈ బస్సులో ప్రమాద సమయంలో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

ప్రమాదానికి అసలు కారణం ఇదే..
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ బస్సు మొదట క్వెట్టా నుంచి 36 మంది ప్రయాణికులతోనే బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో మరో బస్సు పాడైపోవడంతో, ఆ వాహనంలోని ప్రయాణికులను కూడా ఇదే బస్సులోకి ఎక్కించుకున్నారు. దీనివల్ల బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. దీనికి తోడు డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడంతో, ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా భారీ వాహనం పర్వతం పైనుంచి ఒక్కసారిగా కింద ఉన్న లోయలోకి పడిపోయిందని షేరానీ డిప్యూటీ కమిషనర్ వలీ ఖాన్ కాకర్ వెల్లడించారు.

Advertisement

తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు..
ఈ ఘోర ప్రమాదంపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు, స్థానిక జిల్లా యంత్రాంగం వెంటనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని వెలికితీసి చికిత్స నిమిత్తం ఝోబ్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అధికారులు, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.

Also Read: వైద్య చరిత్రలోనే మహా అద్భుతం.. ఒకేసారి 5 అవయవాల మార్పిడితో యువకుడికి పునర్జన్మ!

Advertisement

Related News

యుద్ధం మధ్యే సుప్రీం లీడర్‌కు అంతిమ వీడ్కోలు.. శోకసంద్రంలో ఇరాన్, టెహ్రాన్‌కు చేరిన ఖమేనీ భౌతికకాయం!

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. 11 ఏళ్ల బాలుడి చేతిలో స్టీరింగ్.. 9 మంది సాధువుల దుర్మరణం!

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి.. ఆరుగురు మృతి, 50 మందికి గాయాలు

Antarctica Waterfall: అంటార్కిటికాలో రెడ్ జలపాతం.. ఈ మిస్టరీ వెనుక కథేంటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

పాక్‌లో చొరబడి ఐసిస్ నెట్‌వర్క్‌పై అఫ్గాన్ మెరుపు దాడులు.. అసలు కారణం ఇదే!

ట్రంప్ సర్కార్‌కు ఝలక్.. జన్మహక్కు పౌరసత్వం వ్యవహారం, సుప్రీంకోర్టు కీలక తీర్పు

నిప్పులు కాదండోయ్.. ఈ అగ్నిపర్వతం కురిపించేది అచ్చమైన బంగారం.. ఎక్కడుందో తెలుసా?

Big Stories

×