E-Paper
Advertisement

పాకిస్తాన్‌లో ఘోరం.. ప్రముఖ టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య.. చెల్లెలికి తీవ్ర గాయాలు!

పాకిస్తాన్‌లో ఘోరం.. ప్రముఖ టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య.. చెల్లెలికి తీవ్ర గాయాలు!
Advertisement

TikTok Star Murder: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాక్ స్టార్ షమ్సు బీబీ (Shamsu Bibi) దారుణ హత్యకు గురయ్యారు. ట్యాక్సిలా ప్రాంతంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఆమెపైకి కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 14న జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

కాల్పుల ఘటన ఎలా జరిగిందంటే?

హత్య జరిగిన రోజు కషిష్ అనే వ్యక్తి తన కుమార్తెకు ఫోన్ చేసి ఇంటి బయటకు రమ్మని పిలిచాడని షమ్సు బీబీ తండ్రి ఫజల్ సాహిబ్‌జాదా తెలిపారు. ఆ తర్వాత షమ్సు బీబీ తన 15 ఏళ్ల చెల్లెలు అసిమా, సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయలుదేరినట్లు స్పష్టం చేశారు. వారు ఒక పెట్రోల్ బంక్ సమీపానికి చేరుకోగానే.. 30 నుంచి 35 ఏళ్ల వయస్సున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కారుపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్లు షమ్సు బీబీ మెడలోకి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు ఆమె చెల్లెలు అసిమా తీవ్రంగా గాయపడింది.

Advertisement

టిక్‌టాక్ ఖాతా డీయాక్టివేషన్

షమ్సు బీబీ గత 3-4 ఏళ్లుగా టిక్‌టాక్ వీడియోలు చేస్తోందని ఆమె తండ్రి ఫజల్ సాహిబ్‌జాదా పేర్కొన్నారు. ఆమె సోదరుడు రహమతుల్లా చెప్పిన వివరాల ప్రకారం.. ఆమె ఖాతాకు 1 మిలియన్ (10 లక్షలు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. 30 నుంచి 35 మిలియన్ల మంది ఆమె పోస్టులను లైక్స్ చేశారు. అయితే ఈ దారుణ హత్య అనంతరం కుటుంబ సభ్యులు ఆమె సామాజిక మాధ్యమ ఖాతాను డీయాక్టివేట్ చేశారు.

Advertisement

Also Read: బీజేపి కొత్త కార్యవర్గం.. జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వరి.. స్మృతి ఇరానీకి కీలక పదవి!

ఆర్థిక లావాదేవీల వల్లే..

షమ్సు బీబీకి కౌసర్, జావేద్ అనే వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వద్ద ఉన్న తన డబ్బును తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో షమ్సుకి బెదిరింపులు మెుదలయ్యాయని పేర్కొన్నారు. దీనిపై ఆమె గతంలోనే ఇస్లామాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని తెలియజేశారు. తన కుమార్తె డబ్బును కాజేసే ఉద్దేశంతోనే సదరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రైమ్‌లో కషిష్ అనే వ్యక్తి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: Vi బంపరాఫర్.. రూ.160 లోపే బెస్ట్ కాంబో ప్యాక్స్.. ఫ్రీ కాల్స్, డేటా ఆఫర్లు!

Tags

Related News

అమెరికా సైనికుడిని పట్టిస్తే భారీ రివార్డ్.. మహిళలకైతే డబుల్ ఆఫర్ ఇచ్చేసిన ఇరాన్!

ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ప్రభుత్వాలకు సెన్సార్ షాక్, అసలు మేటరేంటి?

మిచిగాన్‌లో వరుస హత్యలు.. ఆరుగురు మృతి, వారిలో నిందితుడు కూడా, ఏం జరిగింది?

ఆగస్టు 15న భారత్‌కే కాకుండా.. ప్రపంచంలో ఇంకా ఏయే దేశాలకు స్వాతంత్ర్యం వచ్చింది?

ట్రంప్ సంచలన ప్రకటన.. హోర్మూజ్‌పై అమెరికా జెండా ఎగురేస్తాం

తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.7 గా నమోదు, సునామీ హెచ్చరిక జారీ

స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!

Big Stories

Advertisement
×