Michigan: అమెరికాలో గన్ కల్చర్ విచ్చలవిడిగా మారింది. గన్లు పట్టుకుని కాల్చి వేస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. వారానికి ఒకటి లేదా రెండు ఘటనలు జరగుతున్నాయి. తాజాగా మిషిగన్లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. ఘటనకు దారి తీసిన కారణేంటి?
అమెరికాలోని మిషిగన్లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి గన్తో కాల్పులు జరిపిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. డెట్రాయిట్కు 270 కిలోమీటర్ల దూరంలోని మిస్సాకీ కౌంటీలో ఈ ఘటన జరిగింది. 39 ఏళ్ల చాద్ హిక్మన్ తొలుత తన వద్దనున్న గన్ తీసుకుని ముగ్గురు వ్యక్తులను చంపాడు. వారి వయస్సు 45 ఏళ్ల వ్యక్తి, 40 ఏళ్ల మహిళ, 16 ఏళ్ల బాలుడ్ని చంపాడు. ఈ ఘటన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. మరో చోటకు వెళ్లి అక్కడ కూడా కాల్పులు జరిపాడు. 53 ఏళ్ల వ్యక్తి, 29 ఏళ్ల మహిళలను చంపేశాడు. చనిపోయిన ఐదుగురు వ్యక్తలు శరీరాలకు బుల్లెట్ గాయాలయ్యాయి.
బాలికను వేధించిన కేసులో హిక్మన్కు రెండేళ్ల కిందట జైలు శిక్ష పడింది. మృతులంతా అనుమానితుడికి బంధువులా కాదా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఈ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఈ కేసు దర్యాప్తు అధికారులకు సవాలుగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారి మిల్లర్ చెప్పారు. కోర్టు రికార్డుల ప్రకారం.. హిక్మన్ 2024లో బాలికను వేధించిన కేసులో దోషిగా నిర్ధారించింది న్యాయస్థానం. అతడు ఏడాదిపాలు జైలు జీవితం అనుభవించాడు. అదే కేసులో తీవ్రమైన దాడి, నేరపూరిత లైంగిక ప్రవర్తన ఆరోపణలను కొట్టివేసింది న్యాయస్థానం.
53 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభించిన ప్రాంతంలో హిక్మన్ నివాసం ఉండేవాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో కాల్పులు జరగడం అసాధారణం కాదు. హిక్మన్ తరచుగా ఓ వ్యక్తి, అతడి భార్యని వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. నిందితుడు హక్ మన్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. హిక్మన్ ఆయుధాలు కలిగి ఉన్నాడని, ప్రమాదకారని ప్రజలను హెచ్చరించారు. ముందుగా అతడి గురించి ప్రచారం చేశారు.
ALSO READ: ఆగస్టు 15న భారత్కే కాకుండా.. ప్రపంచంలో ఇంకా ఏయే దేశాలకు స్వాతంత్ర్యం వచ్చింది?