BigTV English

KA Paul Viral Video: యుద్ధం ఆపేందుకు రాత్రిపగలు కష్టపడ్డాను.. కేఏ పాల్ వీడియో వైరల్

KA Paul Viral Video: యుద్ధం ఆపేందుకు రాత్రిపగలు కష్టపడ్డాను.. కేఏ పాల్ వీడియో వైరల్

KA Paul Viral Video: మొత్తానికి ఇండియా- పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణానికి పులిస్టాప్ పడింది. మిసైల్స్, డ్రోన్ల అటాక్ లు, కాల్పుల మోతలు ఆగిపోయాయి. దాయాది దేశం కోరిక మేరికు భారత ప్రభుత్వం కాల్పులు విరమణకు ఓకే చెప్పింది. ఈ క్రమంలోనే రెండు దేశాలు ఒక ఒప్పందానికి కూడా వచ్చిన విషయం తెలిసిందే. భారత్- పాకిస్థాన్ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిపిన చర్యలు సఫలం కావడంతో.. రెండు దేశాలు కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.


ఈ క్రమంలోనే భారత్- పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా కీలక పోస్టు చేసిన విషయం తెలిసిందే.  కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని.. తక్షణ సీజ్ ఫైర్‌ కు భారత్, పాకిస్థాన్ అంగీకరించినట్టు ఆయన పోస్టులో తెలిపారు. రాత్రంతా భారత్- పాకిస్థాన్ దేశాలతో చర్చించామని అన్నారు. చర్యలు సఫలం అయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాలకు అభినందనలు కూడా తెలిపిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు స్పందించారు.

ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడం ఇది శుభపరిణామమని అన్నారు. నిన్నటి వరకూ ఈ విషయంతో అమెరికా జోక్యం చేసుకోదని చెప్పిందని అన్నారు. అయితే ఎట్టకేలకు తన ప్రార్థనలు ఫలించాయని చెప్పారు. భారత్ – పాక్ కాల్పుల విరమణకు అంగీకరించండం సంతోషకరని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు తన ప్రయత్నాలు ఆపలేదన్నారు. రిపబ్లికన్, డెమోక్రాట్లతో ఎప్పుడూ టచ్ లోనే ఉన్నానని చెప్పారు. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం ద్వారా నష్టం తప్పా.. కొంచెం కూడా లాభం ఉండదన్నారు. కానీ మరోసారి దేశంపై టెర్రరిస్టులు దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. శాంతి కొరకు హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్‌లో మే 24న సమావేశం నిర్వహిస్తున్నట్టు కేఏ పాల్ తెలిపారు.

Also Read: India Vs Pakistan War : యుద్ధంతో అమెరికా డబుల్ గేమ్ ఆడిందా? ట్రంప్ ప్లాన్ ఇదేనా?

రెండు దేశాల మధ్య యుద్ధం ఆగి శాంతి నెలకొనడంలో కీలక పాత్ర పోషించానని అన్నారు.  ఇండియా – పాక్ శాంతించాలని ప్రార్థిస్తూనే ఉన్నానని చెప్పారు. రాత్రీ పగలు పనిచేస్తూ ఉన్నానని అన్నారు. యుద్ధం చేయడం వల్ల లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోతారని పేర్కొన్నారు. రూ.లక్షల కోట్లు ఆస్తి నష్టం కలుగుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయన రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Imran Khan: పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య..?

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×