E-Paper
Advertisement

Delhi Fire Accident: ఢిల్లీ పాలిథీన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

Delhi Fire Accident: ఢిల్లీ పాలిథీన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం రిఠాలా మెట్రో స్టేషన్‌ సమీపంలో ఉన్న.. పాలిథీన్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర సిబ్బంది  హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని.. 16 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపడుతున్నారు.

మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముగ్గురు మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షాట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేక ఎవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మోతీనగర్ లోని ఓ ఫంక్షన్ హాలులో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా.. భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Also Read: ఒక హనీమున్, ఒక సీక్రెట్ లవర్, ఒక ప్లాన్డ్ మర్డర్.. అసలు కథ ఇది!

వెంటనే సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×