BigTV English
Advertisement

Bihar clock tower: రూ.40 లక్షల క్లాక్ టవర్.. ప్రారంభించిన తర్వాతి రోజే ఆగిపోయిందిగా!

Bihar clock tower: రూ.40 లక్షల క్లాక్ టవర్.. ప్రారంభించిన తర్వాతి రోజే ఆగిపోయిందిగా!

Bihar clock tower Stops Working| బిహార్ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారులు యదేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. దీనికి నిదర్శనంగా ఒక నూతన క్లాక్ టవర్ నిర్మాణం కనిపిస్తోంది. బీహార్‌లో కొత్తగా నిర్మించిన ఓ క్లాక్ టవర్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే పనిచేయడం లేదు. దీంతో ప్రభుత్వ పనితీరు పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజెన్లు వాడివేడిగా తెగ డిబేట్లు పెట్టేస్తున్నారు.


బీహార్ షరీఫ్‌లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.40 లక్షల వ్యయంతో ఒక కాంక్రిట్ క్లాక్ టవర్‌ను నిర్మించారు. ఈ క్లాక్ టవర్ ను స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓపెనింగ్ చేయడం గమనార్హం. సిఎం నితీశ్ కుమార్ చేపట్టిన ప్రగతి యాత్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దీని నిర్మానం జరిగింది. కానీ ఈ క్లాక్ టవర్ ని చూస్తే చాలా సాదాసీదాగా, నాసిరకం నిర్మాణంగా కనిపిస్తుండడంతో ఈ కట్టడాన్ని నిర్మించేందుకు రూ.40 లక్షలు ఖర్చు పెట్టామని చెబుతున్న ప్రభుత్వాధికారుల వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నెటిజెన్లు అయితే ఇది స్కూల్ పిల్లల ప్రాజెక్ట్ లాగా ఉంది. దీన్ని కట్టడానికి రూ.40 లక్షలు ఎలా ఖర్చు అవుతాయని ప్రశ్నించాడు.

ఈ నేపధ్యంలో ఎక్స్ వేదికపై ఓ వ్యక్తి ఫోటోలు పోస్ట్ చేస్తూ.. ‘‘పేలవంగా పెయింట్ వేసిన ఈ కాంక్రీట్ క్లాక్ టవర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద నిర్మించారు. ప్రారంభం 24 గంటల్లోనే దీని గడియారం పనిచేయడం లేదు. ఈ నిర్మాణానికి ఖర్చు ఎంతో మీరు ఊహించగలరా? ఈ అద్భుత నిర్మాణానికి కేవలం రూ.40 లక్షలు పెట్టరంట.. అధికారులకు హ్యాట్సాఫ్!’’ అని రాశాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.


Also Read: 2 భర్తలు, 3 పిల్లలు.. మైనర్ ప్రేమికుడి కోసం హిందూ మతం స్వీకరించిన ముస్లిం యువతి

బీహార్‌లో అధికారుల అవినీతికి నిదర్శనంగా ఈ క్లాక్ టవర్‌ని చూసే నెటిజన్లు, బ్రిటీష్ కాలంలో నిర్మించబడిన క్లాక్ టవర్‌ను పోల్చుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో అధికారులు స్పందించారు. ‘‘దయచేసి అలాంటి పుకార్లను నమ్మవద్దు. ఈ క్లాక్ టవర్ డిజైన్, నిర్మాణ పనులు ఇంకా పూర్తవ్వలేదు’’ అని బీహార్ షరీఫ్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ అనే ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు.

అంతేకాదు.. ‘‘కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కొత్తగా నిర్మించిన క్లాక్ టవర్‌లోని కేబుల్లను దొంగిలించారని, దానిని తిరిగి ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంది. ఈ క్లాక్ టవర్ పూర్తి నిర్మాణం పూర్తయిన తర్వాతే పూర్గి స్థాయిలో ఈ కట్టడం ప్రారంభోత్సవం జరగనుంది’’ అని మరో పోస్ట్‌లో బీహార్ షరీఫ్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ పేర్కొంది.

Also Read: దళితుడు ప్రవేశించాడని ఆలయం శుద్ధి చేసిన బిజేపీ నాయకుడు.. రాహుల్ గాంధీ ఫైర్

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×