E-Paper
Advertisement

Cargo ship Fire Near Goa| కార్గో షిప్పులో భారీ అగ్ని ప్రమాదం.. 3 అగ్నిమాపక షిప్పులతో చర్యలు.. గోవా తీర సమీపంలో ఘటన

Cargo ship Fire Near Goa| కార్గో షిప్పులో భారీ అగ్ని ప్రమాదం.. 3 అగ్నిమాపక షిప్పులతో చర్యలు.. గోవా తీర సమీపంలో ఘటన
Advertisement

Cargo ship Fire Near Goa| ప్రమాదకర పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్న కార్గో షిప్పులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం గోవా తీరానికి సమీపంలో జరిగిందని ఇండియాన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) అధికారులు తెలిపారు.

గోవా తీరానికి 102 నాటికల్ మైల్స్ (190 కిలోమీటర్ల) దూరంలో ఎంవీ మెయర్‌స్క్ ఫ్రాంక్ ఫర్ట్ కార్గో షిప్పులో అగ్ని ప్రమాదం జరిగింది. గుజరాత్ లోని ముంద్రా పోర్టు నుంచి శ్రీలంక కొలంబోకు బయలుదేరిన ఈ కార్గో షిప్పులో ప్రమాదకర పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారిక సమాచారం. ఈ షిప్పులో మొత్తం 21 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది ఫిలిపీన్స్ పౌరులు, ఇద్దరు యుక్రెయిన్ పౌరులు, ఒకరు రష్యన్, ఒకరు మాంటెనెగ్రోకు చెందిన వారున్నారు. అయితే సిబ్బందిలో ఫిలిపీన్స్ పౌరుడు కనిపించడం లేదని సమాచారం.

Advertisement

అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంనే ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు అగ్నిమాపక చర్యలు చేపట్టేందుకు మూడు అగ్నిమాపక షిప్పులు, ఒక డార్నియర్ మేరిటైమ్ పాట్రోలింగ్ విమానాన్ని ఘటనా స్థలానికి పంపించింది.

Also Read| NEET PG 2024: ‘వెబ్ సైట్ క్రాష్, లాగిన్ ప్రాబ్లమ్.. నాలుగు సెంటర్ల ఆపషన్లు’.. మండిపడుతున్న విద్యార్థులు

Advertisement

కార్గో షిప్పులో ముందు భాగంలో అగ్ని ప్రమాదం సంభవించిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఐసిజి అధికారులు తెలిపారు. అయితే సముద్రంలో నైరుతి వర్షాల కారణంగా భారీ అలజడి ఉందని, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం. అగ్నిమాపక చర్యల్లో భాగంగా ఐసిజికి చెందిన మూడు షిప్పులు అగ్ని జ్వాలలను ఆర్పేందుకు నీరు, ఏఖియస్ ఫిల్మ్ కెమికల్ ఫోమ్‌ని ఉపయోగిస్తున్నారు.

షిప్పులో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. అగ్నిప్రమాదం జరిగిన షిప్పులో పేలుడు పదార్థాలతో పాటు 1400 మెట్రిక్ టన్నుల డీజిల్ ఉండడం ఆందోళనకర విషయమని ఐసిజి అధికారులు అన్నారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×